టీసిఎస్‌కు షాక్.. ఉద్యోగులకు రిలీఫ్: వెళ్లనివ్వమంటున్న యూపీ సర్కార్?..

లక్నో నుంచి ఐటీ కార్యాలయం తరలిపోవడానికి అనుమతించమని ఆర్థికమంత్రి రాజేశ్ అగర్వాల్ అన్నారు.

పుణే: ఉత్తరప్రదేశ్ లోని టీసీఎస్ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ఇటీవల సంస్థ ప్రతినిధులు ప్రకటించిన సంగతి తెలిసిందే. లక్నో యూనిట్ ను మూసివేసి ఉద్యోగులను తరలిస్తామని సంస్థ చెప్పింది. సంస్థ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా చాలామంది ఉద్యోగులపై వేటు పడుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కల్పించుకుంది. టీసీఎస్ లక్నో యూనిట్ మూసివేతకు అనుమతించమని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. విషయాన్ని ఆర్థికమంత్రికి అప్పగించి పరిశీలించాలని కోరినట్లు తెలిపింది. దీనిపై స్పందించిన ఆర్థికమంత్రి రాజేశ్ అగర్వాల్.. నగరం నుంచి ఐటీ కార్యాలయం తరలిపోవడానికి అనుమతించమని అన్నారు.

wont let TCS go away from Lucknow: UP minister

టీసీఎస్ నిర్ణయం వెనుక కారణాలను తెలుసుకుంటామని, ఇందుకోసం సంస్థతో సంప్రదింపులు జరుపుతామని అన్నారు. లక్నో ఆఫీస్ మూతపడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలావరకు ఉపాధి కోల్పోతారని భావించిన టీసీఎస్ ఉద్యోగులు ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా ఇతర మంత్రులకు లేఖలు రాశారు. దీంతో మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, మొహ్సిన్ రాజా వారికి భరోసానిచ్చారు. సంస్థతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని హామి ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+