2029లో ముస్లిం ప్రధాని- అడ్డుకోవాలంటే- హిందువులు ఆయుధాలు పట్టాలన్న యతీ నరసింఘానంద్
వివాదాస్పద మతగురువు యతీ నరసింఘానంద్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఈ నెల 17 నుంచి 19 వరకూ మూడు రోజుల పాటు ఆయన ధరం సంసద్ పేరుతో ఓ మతపరమైన సదస్సు నిర్వహించారు. ఇందులో పలువురు బీజేపీ నేతలతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఇందులో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
ముస్లింలకు వ్యతిరేకంగా యతీ నరసింఘానంద్ హరిద్వార్ సదస్సులో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2029లో ముస్లిం ప్రధానమంత్రి కాకుండా అడ్డుకునేందుకు హిందువులు ఆయుధాలు చేపట్టాల్సిన అవసరం ఉందని యతీ నరసింఘానంద్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ సదస్సుకు హాజరైన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి అశ్వినీ ఉపాధ్యాయ్.. తాను ఈ సమావేశంలో రాజ్యాంగంపై ప్రసంగించానని, దానికి ముందూ వెనుకా ఏం జరిగాయో తనకు తెలియదన్నారు. ఘజియాబాద్లోని ఒక దేవాలయానికి అధిపతిగా ఉంటూ ముస్లింలను లక్ష్యంగా చేసుకుని అనేక వివాదాలు సృష్టించిన నర్సింహానంద్కు, మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ఆరోపణలు చేసినందుకు తాను రాజ్యాంగం కాపీని ఇచ్చానని ఉపాధ్యాయ్ తెలిపారు.
కాబట్టి హిందువులు ఆర్థిక బహిష్కరణతో పాటు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. "కత్తులను మరచిపోండి, అవి వేదికపై షోకేస్గా మాత్రమే ఉపయోగించబడతాయి. మంచి ఆయుధాలను కలిగి ఉన్నవారి ద్వారా యుద్ధంలో విజయం సాధిస్తారు. మెరుగైన ఆయుధాలు మాత్రమే మిమ్మల్ని రక్షించగలవని యతీ నరసింఘానంద్ పిలుపునిచ్చారు.