Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2029లో ముస్లిం ప్రధాని- అడ్డుకోవాలంటే- హిందువులు ఆయుధాలు పట్టాలన్న యతీ నరసింఘానంద్

వివాదాస్పద మతగురువు యతీ నరసింఘానంద్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఈ నెల 17 నుంచి 19 వరకూ మూడు రోజుల పాటు ఆయన ధరం సంసద్ పేరుతో ఓ మతపరమైన సదస్సు నిర్వహించారు. ఇందులో పలువురు బీజేపీ నేతలతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఇందులో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.

ముస్లింలకు వ్యతిరేకంగా యతీ నరసింఘానంద్ హరిద్వార్ సదస్సులో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2029లో ముస్లిం ప్రధానమంత్రి కాకుండా అడ్డుకునేందుకు హిందువులు ఆయుధాలు చేపట్టాల్సిన అవసరం ఉందని యతీ నరసింఘానంద్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ సదస్సుకు హాజరైన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి అశ్వినీ ఉపాధ్యాయ్.. తాను ఈ సమావేశంలో రాజ్యాంగంపై ప్రసంగించానని, దానికి ముందూ వెనుకా ఏం జరిగాయో తనకు తెలియదన్నారు. ఘజియాబాద్‌లోని ఒక దేవాలయానికి అధిపతిగా ఉంటూ ముస్లింలను లక్ష్యంగా చేసుకుని అనేక వివాదాలు సృష్టించిన నర్సింహానంద్‌కు, మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ఆరోపణలు చేసినందుకు తాను రాజ్యాంగం కాపీని ఇచ్చానని ఉపాధ్యాయ్ తెలిపారు.

yati narasinghanands haridwar meet seeks weapons for Hindus, ‘war on Muslims’
ఈ సదస్సులో యతీ నరసింఘానంద్ మాట్లాడుతూ... ఈ ధరమ్ సన్సద్ యొక్క ఏకైక అంశం ఏమిటంటే, 2029లో భారత ప్రధాని ముస్లిం అవుతాడు. ఇది నిరాధారమైన ఆలోచన కాదు, జనాభా మార్పును అర్థం చేసుకున్న వారికి ఇది తెలుస్తుంది... ముస్లిం జనాభా పెరుగుతున్న తీరు, మన జనాభా తగ్గుతున్న తీరు చూస్తుంటే.. ఏడు-ఎనిమిదేళ్లలో రోడ్లపై ముస్లింలు మాత్రమే కనిపిస్తారు. నేను గత 23 సంవత్సరాలుగా ప్రజలకు ఈ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. 2029లో ఒక ముస్లిం ప్రధాని అయితే, "ఇస్లాం చరిత్రను పరిశీలిస్తే, రాబోయే 20 సంవత్సరాలలో, 50% హిందువులు మతం మారతారు, 40% హిందువులు చంపబడతారు. కేవలం 10% మంది హిందువులు మాత్రమే అమెరికా, కెనడా, లండన్, యూరప్‌లో లేదా భారతదేశంలోని ఐరాస శరణార్థి శిబిరాల్లో ఎక్కడో ఉంటారు. మఠాలు ఉండవు, దేవాలయాలు ఉండవు. మా తల్లులు, సోదరీమణులందరినీ అత్యాచారం చేసి మార్కెట్‌లో అమ్ముతారంటూ రెచ్చిపోయారు. భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, ఇస్లామిక్ జిహాద్ అత్యంత శక్తివంతమైనదని, ఇతర మతాల వ్యక్తులను కూడా అందులోకి లాక్కుంటుందన్నారు.

కాబట్టి హిందువులు ఆర్థిక బహిష్కరణతో పాటు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. "కత్తులను మరచిపోండి, అవి వేదికపై షోకేస్‌గా మాత్రమే ఉపయోగించబడతాయి. మంచి ఆయుధాలను కలిగి ఉన్నవారి ద్వారా యుద్ధంలో విజయం సాధిస్తారు. మెరుగైన ఆయుధాలు మాత్రమే మిమ్మల్ని రక్షించగలవని యతీ నరసింఘానంద్ పిలుపునిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+