బలపరీక్షకు ముందే సీఎం కుమారస్వామికి బీజేపీ వార్నింగ్: ఈ రోజు చెయ్యాలి, లేదంటే సినిమా!
బెంగళూరు: శుక్రవారం మద్యాహ్నం కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్.డి.కుమారస్వామి కర్ణాటక శాసన సభలో బలపరీక్షలో మెజారీ ఎమ్మెల్యే మద్దతుతో తన పదవిని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న సందర్బంలో సీఎం కుమారస్వామి మా డిమాండ్లు ఈ రోజు తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని బీజేపీ హెచ్చరించింది. ఈ రోజు రైతుల రుణమాఫీ చెయ్యాలని బీఎస్. యడ్యూరప్ప సీఎం కుమారస్వామికి అల్టిమేటం జారీ చేశారు.

శాసన సభ సమావేశం
విధాన సౌధకు బయలుదేరే ముందు బీఎస్. యడ్యూరప్ప ప్రైవేటు హోటల్ దగ్గర మీడియాతో మాట్లాడారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో జేడీఎస్ నేత హెచ్.డి. కుమారస్వామి ప్రజలకు హామీ ఇచ్చారని బీఎస్. యడ్యూరప్ప గుర్తు చేశారు.

మెజారిటీ లేదంట
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత దేవాలయం దగ్గర మీడియాతో మాట్లాడిన హెచ్.డి. కుమారస్వామి జేడీఎస్ కు సంపూర్ణ మెజారిటీ లేనందున రైతుల రుణమాఫీ చెయ్యడం కష్టంగా ఉందని ఇదే హెచ్.డి. కుమారస్వామి చెప్పడం విడ్డూరంగా ఉందని యడ్యూరప్ప ఎద్దేవ చేశారు.

సీఎంకు బీజేపీ వార్నింగ్
శుక్రవారం శాసన సభలో బలపరీక్ష నిరూపించుకున్న వెంటనే రైతుల రుణమాఫీ చేస్తున్నామని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ప్రకటించాలని బీఎస్. యడ్యూరప్ప డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ చెయ్యకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని బీఎస్. యడ్యూరప్ప హెచ్చరించారు.

సూట్ కేస్ ప్రభుత్వం
తన కుమారుడు పూర్తి కాలం అధికారంలో ఉండరని స్వయంగా సీఎం హెచ్.డి. కుమారస్వామి తల్లి చెప్పారని యడ్యూరప్ప ఆరోపించారు. అంతేకాకుండా సీఎం హెచ్.డి. కుమారస్వామి సొంత సోదరుడు హెచ్.డి. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ సూట్ కేసు ఉన్నంత వరకే జేడీఎస్ ప్రభుత్వం అని చెప్పారని, ఇలాంటి పార్టీ అధికారంలోకి రావడంతో కన్నడిగులు తలదించుకుంటున్నారని యడ్యూరప్ప విమర్శించారు.

జేడీఎస్ ను కాంగ్రెస్ అంతం చేస్తోంది
జేడీఎస్ ను పూర్తిగా అంతం చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దం అయ్యిందని బీఎస్. యడ్యూరప్ప ఆరోపించారు. ఆ విషయం గ్రహించలేని కుమారస్వామి సీఎం కుర్చిలో కుర్చోవడానికి సిద్దం అయ్యారని, రానున్న రోజుల్లో జేడీఎస్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆ పార్టీ నాయకులకే తెలుస్తోందని బీఎస్. యడ్యూరప్ప జోస్యం చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications