యూపీలో 1.3 లక్షల స్కూళ్లలో తనిఖీలు- యోగీ ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు..
ఉత్తర్ ప్రదేశ్ లో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పాలనలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలోని 1.3 లక్షల ప్రభుత్వ స్కూళ్లలో సేఫ్టీ ఆడిట్ కు యోగీ ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లలో భద్రత, భవనాల నాణ్యతను పరిశీలించేందుకు వీలుగా ఈ ఆడిట్ కొనసాగనుంది. తద్వారా విద్యార్ధులు చదువుకునే చోట భద్రంగా ఉండాలనేది సర్కార్ ఉద్దేశం.
ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భవనాల భద్రత, వినియోగాన్ని నిర్ధారించడానికి 1.3 లక్షలకు పైగా ప్రభుత్వ పాఠశాలలపై ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది. పాఠశాల భవనాల పరిశీలన, క్యాంపస్ బయటి ప్రాంతాలతో పాటు గదుల్లో పరిశీలనల కోసం విద్యా శాఖ ఆడిట్ చెక్లిస్ట్ ఇచ్చింది. పాఠశాల భవనాలను చాలా మంచివి, మంచివి, చెడ్డవి, చాలా చెడ్డవిగా వర్గీకరించాలని ప్రాథమిక విద్యాశాఖాధికారులందరినీ డైరెక్టర్ జనరల్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ్ కిరణ్ ఆనంద్ కోరారు.

రాష్ట్రంలోని స్కూళ్లలో సరిహద్దు గోడ, నేల, గోడలలో ఇటుక పనితనం, మెట్లు, ర్యాంప్లు, మరుగుదొడ్లు, అగ్ని, విద్యుత్, వరద భద్రత వంటి అంశాలపై ఆధారపడి వీటికి రేటింగ్ ఇస్తారు. శిథిలమైన భవనాల పునర్నిర్మాణంతో పాటు, విస్తృతమైన పాఠశాల భద్రతా ఆడిట్ నిర్వహించడం ద్వారా నిర్మాణాల స్థిరత్వం కోసం ఇప్పటికే ఉన్న భవనాలను తనిఖీ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 13,698 పాఠశాల భవనాలు ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. వీటిలో 7,100 పాఠశాలల్లో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలోని స్కూళ్లలో నిలువు గోడలు, స్లాబ్ల పరిశీలన కోసం పగుళ్లు, సీపేజ్, తేమ వంటి లోపాలను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఇందుకోసం నాలుగు అంశాలతో కూడిన మార్గదర్శకాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.త్వరలో ఈ తనిఖీలు పూర్తి చేసి అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నారు.












Click it and Unblock the Notifications