అతీక్ హత్య తర్వాత తొలిసారి ప్రయాగ్ రాజ్ కు యోగీ.. ప్రకృతి ఎవర్నీ వదలదంటూ..
యూపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెలలో రెండు దశల్లో జరిగే స్ధానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇందులో భాగంగా యోగీ పలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా హత్యకు గురైన మాజీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ స్వస్ధలం ప్రయాగ్ రాజ్ కు వెళ్లిన యోగీ.. ఆయన హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి ఎవర్నీ వదలిపెట్టదంటూ యోగీ వ్యాఖ్యానించారు.
అతిక్ అహ్మద్ స్వస్ధలం ప్రయాగ్ రాజ్ లో ఎన్నికల సభలో మాట్లాడిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. అన్యాయం, దౌర్జన్యాలతో బాధపడుతున్న ప్రజలు న్యాయం కోసం వచ్చే ప్రయాగ్రాజ్ను కొందరు వ్యక్తులు అన్యాయం, దౌర్జన్యాల భూమిగా మార్చారని అతీక్ అహ్మద్ ను ఉద్దేశించి యోగీ వ్యాఖ్యానించారు. కానీ ప్రయాగ్ రాజ్ ఎవరిపైనా దౌర్జన్యానికి పాల్పడదని, అలాగే అంగీకరించదని అన్నారు.

ఏప్రిల్ 15న అతీక్, అతని సోదరుడు అష్రప్ బహిరంగ హత్యల తర్వాత విమర్శలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో మాఫియాను లేకుండా చేస్తామని సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రకటించారు. అప్పటి నుంచి స్ధానిక ఎన్నికల ప్రచారంలోనూ మాఫియా గురించి ప్రస్తావిస్తున్న యోగీ.. శాంతి భద్రతల పరిరక్షణే తమ ప్రథమ లక్ష్యమని చెబుతున్నారు. ఇవాళ ప్రయాగ్ రాజ్ లో నిర్వహించిన ప్రచారంలోనూ ఇదే అంశాన్ని యోగీ ప్రజలకు వివరించారు.
ఉత్తరప్రదేశ్లో జనం భయం, భయాందోళనల నీడలో పండుగలు చేసుకున్నారని, నేడు పండుగలు శాంతియుతంగా చేసుకుంటున్నారని తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో కర్ఫ్యూ లేదు, అల్లర్లు లేవు. నగరాల్లో ఈవ్ టీజర్ల భీభత్సం లేదని గుర్తుచేశారు. ఇవాళ మన నగరాలు సేఫ్ సిటీలుగా మారుతున్నాయన్నారు. బాలికలు సురక్షితంగా పాఠశాలకు వెళ్లవచ్చని, వ్యాపారవేత్తలు వ్యాపారం చేయవచ్చని, యువత చేతుల్లో తపంచాకు బదులుగా ట్యాబ్లెట్లు ఉన్నాయన్నారు.
-
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్ఫర్డ్లో "ఏఐ" పై ప్రసంగం..! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
నిన్ను డ్రమ్ములో ప్యాక్ చేస్తా: భార్య బెదిరింపులకు భర్త షాకింగ్ నిర్ణయం -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్












Click it and Unblock the Notifications