మోడీ నియోజకవర్గంలో 24న కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవం-యోగీ ఆదిత్యనాథ్ స్పెషల్ ఫోకస్..

వారణాసి : యూపీలోని ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. గతంలో యూపీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి కావడంతో వాటిని ఈ నెల 24న ప్రారంభించేందుకు మోడీ ఇక్కడికి వస్తున్నారు. దీంతో ఈ టూర్ ను యోగీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

మామిడి, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ప్యాకింగ్, మార్కెటింగ్ కోసం ఉద్దేశించిన ఇంటిగ్రేటెడ్ ప్యాకేజింగ్ హౌస్ ప్రాజెక్టును వారణాసిలో ఈ నెల 24న ప్రధాని మోడీ ప్రారంభించబోతున్నారు. ఈ ప్రాజెక్టును ప్రధాని మోడీ.. 2021 జూన్ 15న శంఖుస్ధాపన చేశారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే దీన్ని పూర్తి చేసి ప్రారంభించేందుకు మోడీ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్యాకేజింగ్ ప్రాజెక్టుతో పాటు ఇతర అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు మోడీ వారణాసి వస్తున్నారు.

yogi adityanath reviews projects to be opened by pm modi on march 24

మోడీ ప్రారంభించబోయే ప్రాజెక్టుల్లో లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్ పోర్టులో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ , పోలీసు బరాక్స్, సోలార్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వీటిని ప్రారంభించేందుకు మోడీ రానున్న నేపథ్యంలో యోగీ ఆదిత్యనాథ్ అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు.

ఈ ప్రాజెక్టుల పురోగతి, వీటి ప్రారంభోత్సవం సందర్భంగా తీసుకుంటున్న చర్యలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్న యోగీ ఆదిత్యనాథ్.. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అలాగే భద్రతతో పాటు ఇతర చర్యలపై యోగీ సమీక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+