అసెంబ్లీలో నిద్రపోయిన ఎమ్మెల్యేలకు యోగి క్లాస్: రిపీట్ కావద్దని హెచ్చరిక!
ఈ వ్యవహారంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు. సమావేశాలను తొలిసారిగా లైవ్ ప్రసారం చేయిస్తే.. ఇలాంటి పరిస్థితి కల్పించి పార్టీకి ఇబ్బంది కొనితెచ్చారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో కునుకు తీసిన మంత్రిని
లక్నో: జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం సమావేశమైన యూపీ అసెంబ్లీలో.. కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఓ మంత్రి కునుకేసిన సంగతి తెలిసిందే. తొలిసారిగా యూపీ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా లైవ్ ప్రసారం చేసిన నేపథ్యంలో.. యూపీ నేతల నిద్రను ప్రజలంతా వీక్షించారు. దీంతో అధికార పార్టీ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వ్యవహారంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు. సమావేశాలను తొలిసారిగా లైవ్ ప్రసారం చేయిస్తే.. ఇలాంటి పరిస్థితి కల్పించి పార్టీకి ఇబ్బంది కొనితెచ్చారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో కునుకు తీసిన మంత్రిని ప్రత్యేకంగా చాంబర్ కు పిలిపించుకుని క్లాస్ పీకినట్లు సమాచారం.

బాధ్యాతయుతమైన మంత్రి పదవిలో ఉండి.. ఓవైపు ప్రజాసమస్యలపై సీరియస్ గా చర్చ జరుగుతుంటే, నిద్ర ఎలా వస్తుందని నిలదీశారు. దీంతో జరిగిన దానికి సదరు మంత్రి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రాత్రంతా నియోజకవర్గంలో పర్యటించినందువల్లే తనకు నిద్ర ముంచుకొచ్చిందని మంత్రి చెప్పారట. దీంతో మరోసారి ఇలాంటి పరిస్థితి కల్పించవద్దని సీఎం యోగి ఆయన్ను హెచ్చరించి పంపించారట.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications