ఇలా ఐతే ఎలా: జగన్ చక్రం, కారత్ హామీ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జాతీయ పార్టీ నాయకులను కలుస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఆయన సిపిఎం ప్రధాన కార్యదర్శఇ ప్రకాశ్ కారత్ను కలిశారు. అనంతరం జగన్ విలేకరులతో మాట్లాడారు.
అసెంబ్లీ తిరస్కరించినా, బిల్లును లోకసభలో ప్రవేశపెట్టారని, బిల్లును ప్రవేశపెట్టేముందు అభిప్రాయం తెలుసుకోకుండా, అంతా పది సెకన్లలో ముగించేశారని జగన్ ఆయనకు వివరించారు. ఇలాంటి అన్యాయాన్ని అంగీకరిస్తే దుష్ట సంప్రదాయానికి బాటలు పరిచినట్టేనని అవుతుందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కారత్ తమతో కలిసి వస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.
కేంద్రం లోక్ సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టలేదని ప్రకాశ్ కారత్ అన్నారు. బిల్లును ప్రవేశపెట్టామని చెబుతున్న ప్రభుత్వ వాదనను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు.

జగన్ 1
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జాతీయ పార్టీ నాయకులను కలుస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఆయన సిపిఎం ప్రధాన కార్యదర్శఇ ప్రకాశ్ కారత్ను కలిశారు.

జగన్ 2
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం జెడి(యు) అధ్యక్షులు శరద్ యాదవ్ను కలిసి, సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని కోరారు.

జగన్ 3
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, జెడి(యు) అధ్యక్షులు శరద్ యాదవ్లు కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...

జగన్ 4
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం జెడి(యు) అధ్యక్షులు శరద్ యాదవ్ను కలిసి, సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని కోరారు.












Click it and Unblock the Notifications