ఎగ్జిట్ పోల్: జగన్-బాబు టగ్గాఫ్ వార్, కేంద్రంలో కీ రోల్
హైదరాబాద్: ఎగ్జిట్ పోల్ సర్వే రాష్ట్రంలో ఉత్కంఠను కలిగిస్తున్నాయి. సీమాంధ్రలో ఎన్నికలు ముగియగానే వచ్చిన పలు ఎగ్జిట్ పోల్ సర్వే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటే, గురువారం ఎన్డీటీవీ ఇచ్చిన సర్వే అందుకు పూర్తి భిన్నంగా ఉంది. దీంతో సర్వాత్రా సీమాంధ్రలో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.
సీమాంధ్రలో టిడిపి 120కి పైగా సీట్లు గెలుచుకుంటుందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 70 స్థానాలకు పరిమితమవుతుందని తొలి సర్వేలు చెప్పాయి. ఎన్డీటీవి మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 80 నుండి 100 సీట్లు వస్తాయని, టిడిపికి 75 నుండి 95 స్థానాలు వస్తాయని చెప్పింది.
అలాగే టిడిపి, బిజెపి కూటమికి సీమాంధ్రలో 18-22 సీట్లు వస్తాయని తొలి సర్వేలు చెప్పగా.. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 12, టిడిపికి 13 సీట్లు వస్తాయని తెలుస్తోంది. అయితే, తొలి సర్వేల్లో కొన్ని... టిడిపికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పోటా పోటీ ఉంటుందని, ఇరు పార్టీలు 11కు అటు ఇటు గెలుచుకుంటాయని చెప్పాయి. అయితే కేంద్రంలో చంద్రబాబు లేదా జగన్ కీ రోల్ పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చిరంజీవి
సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించే అవకాశం కనిపించడం లేదు. మున్సిపల్, ప్రాదశిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. సార్వత్రిక ఎన్నికలలోను అదే పునరావృతం అయ్యే అవకాశముంది.

వైయస్ జగన్
వైయస్ మృతి అనంతరం వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించారు. ఆయన పార్టీని స్థాపించాక జరిగిన ఉప ఎన్నికల్లో దాదాపు అన్నింటిని ఆయనే గెల్చుకున్నారు. అయితే, ఇప్పటి గాలి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.

వైయస్ జగన్
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జగన్కు అనుకూలంగా ఉంటాయని కొన్ని సర్వేలు, వ్యతిరేకంగా ఉంటాయని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి.

వైయస్ జగన్
ఇటీవల జరిగిన మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆశాజనకంగా లేవనే చెప్పవచ్చు.

వైయస్ జగన్
ఎగ్జిట్ పోల్ సర్వే రాష్ట్రంలో ఉత్కంఠను కలిగిస్తున్నాయి. సీమాంధ్రలో ఎన్నికలు ముగియగానే వచ్చిన పలు ఎగ్జిట్ పోల్ సర్వే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటే, గురువారం ఎన్డీటీవీ ఇచ్చిన సర్వే అందుకు పూర్తి భిన్నంగా ఉంది. దీంతో సర్వాత్రా సీమాంధ్రలో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.

చంద్రబాబు
సీమాంధ్రలో టిడిపి 120కి పైగా సీట్లు గెలుచుకుంటుందని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 70 స్థానాలకు పరిమితమవుతుందని తొలి సర్వేలు చెప్పాయి. ఎన్డీటీవి మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 80 నుండి 100 సీట్లు వస్తాయని, టిడిపికి 75 నుండి 95 స్థానాలు వస్తాయని చెప్పింది.












Click it and Unblock the Notifications