అర్నబ్ గోస్వామికి జకీర్ నాయక్ షాక్ : 500కోట్ల పరువు నష్టం దావా
న్యూఢిల్లీ : వివాదస్పద ఇస్లాం ప్రవచనకర్తగా గతకొద్ది రోజులుగా వార్తల్లో నానుతున్న పేరు జకీర్ నాయక్. తాజాగా టైమ్స్ నౌ ఛానెల్ పై రూ. 500 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేసి మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ మారారు జకీర్ నాయక్.
ముఖ్యంగా టైమ్స్ నై ఛీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారని, విద్వేషాలు రెచ్చగొట్టే కథనాలు ప్రసారం చేశారని ఆరోపిస్తూ పరువు నష్టం దావా దాఖలు చేశారు జకీర్ నాయక్. దీనికి సంబంధించి జకీర్ తరుపు న్యాయవాది ముబిన్ సోల్కర్ టైమ్స్ నై ఛానెల్ కు నోటీసులు పంపించినట్లుగా సమాచారం.

అయితే టైమ్స్ నౌ తో పాటు మరో పది మీడియా సంస్థలపైన కూడా జకీర్ నాయక్ పరువు నష్టం దావా వేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే అర్నబ్ తన ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించారు జకీర్. కాగా, ఢాకాలో ఉగ్రదాడి అనంతరం దాడితో సంబంధమున్న నిందితులు జకీర్ నాయక్ ప్రసంగాలతో ప్రభావితమైనట్లుగా బంగ్లా పోలీసులు నిర్దారించడంతో టైమ్స్ నౌ ఛానల్ దాన్ని హైలైట్ చేస్తూ వార్త కథనాలు ప్రసారం చేసింది. అయితే అవన్నీ నిరాధారం అంటున్నారు జకీర్ నాయక్.
జకీర్ నాయక్ పై చేసిన ఆరోపణలన్నింటిని ఉపసంహరించుకుని, క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు జకీర్ తరుపు న్యాయవాది ముబిన్ సోల్కర్. ఇకపోతే ప్రస్తుతం జకీర్ నాయక్ సౌదీ అరేబియాలో ఉంటున్నట్లు సమాచారం. ఆయన పీస్ టీవీ ద్వారా ఇస్లాం మత బోధనలు చేస్తోన్న విషయం విదితమే.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications