పాక్కు మద్దతుగా సీరియల్: జీ గ్రూప్ 'జీ జిందగీ ఛానెల్' కు బీసీసీసీ నోటీసులు
న్యూఢిల్లీ: జీ గ్రూపుకు చెందిన జీ జిందగీ ఛానెల్కు కేంద్రం నోటీసులు పంపింది. జిందగీ ఛానెల్లో ప్రసారమయ్యే 'వక్త్ నే కియా క్యా హసీ సితాం' అనే సీరియల్పై ఫిర్యాదులు రావడంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సీరియల్లో దేశ విభజనపై పాకిస్ధాన్కి మద్దతుగా ఉందంటూ సదరు మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదులను మంత్రిత్వ శాఖ బ్రాడ్ కాస్ట్ కంటెంట్ కంప్లెయింట్స్ కౌన్సిల్ (బీసీసీసీ)కి పంపింది.

దీంతో, జస్టిస్ ముకుల్ ముద్గల్ నేతృత్వంలోని బీసీసీసీ కమిటీ వాటిని పరిశీలించిన తర్వాత జీ జిందగీ ఛానెల్ యాజమన్యానికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై మే 22న విచారణ ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే తమకు ఇంకా నోటీసులు అందలేదని జీ గ్రూపు అధికారి ఒకరు తెలిపారు. ఈ సీరియల్లో విభజన సమయంలో పాకిస్ధానీలను హీరోలుగా, భారతీయులను విలన్లుగా చూపించారని సమాచార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు అందాయి.
ఇది ఇలా ఉంటే సీరియల్లో నటిస్తున్న నటీనటులు కూడా పాకిస్ధాన్ వారు కావడం విశేషం. పాకిస్ధాన్కు చెందిన నటుడు ఫవాద్ ఖాన్, నటి సనమ్ బాలోచ్లకు భారత్లో కూడా పేరుండటంతో వీరిద్దరిని పెట్టి సీరియల్ తీశారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications