మోసపోయాం: 100 మంది గర్భవతులు అయ్యారు
న్యూయార్క్: గర్భ నిరోధక మాత్రలు వేసుకున్నా తాము గర్భవతులు అయ్యామని, మేము మోసపోయామని ఆరోపిస్తూ వంద మందికి పైగా కోర్టును ఆశ్రయించారు. ఆ మాత్రలు తయారు చేసిన ఫార్మా సూటికల్ కంపెనీల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టులో మనవి చేశారు.
అదే విదంగా మాకు ఇష్టంలేకపోయినా గర్భవతులు అయ్యామని, తమకు భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని నోటీసులు పంపించారు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని కొందరు మహిళలు వారికి గర్భం దాల్చడం ఇష్టం లేక గర్భనిరోధక మాత్రలు వేసుకున్నారు.
ఫిలడెల్ఫియాలో నాలుగు ఫార్మాసూటికల్స్ కంపెనీలు తయారు చేసిన మాత్రలు వారు వేసుకున్నారు. అయితే వారు గర్భం దాల్చాడంపై కోర్టును ఆశ్రయించారు. నిర్లక్షంగా మాత్రలు తయారు చేసి గర్భనిరోధక మాత్రలు అని మార్కెట్ లో విక్రయించి ప్రజలను మోసం చేస్తున్నారని వారు కోర్టును ఆశ్రయించారు.

అంతే కాకుండ ఫిలడెల్ఫియాలోని నాలుగు కంపెనీల మీద కేసులు పెట్టారు. తమకు ఇష్టం లేకపోయినా గర్భం దాల్చామని, మా పిల్లలకు 18 ఏళ్ల వచ్చే వరకు విద్య, వైద్యం, నిర్వహణ, పెరుగుదలకు అయ్యే ఖర్చులు ఆ కంపెనీలు భరించాలని కోర్టు ద్వారా నోటీసులు పంపించారు. ఇప్పటికే 94 మంది మహిళలు పిల్లలకుజన్మనించారు
సుమారు 100 మందికి పైగా మహిళలు కేసులు పెట్టి కోర్టును ఆశ్రయించి నోటీసులు పంపించడంతో ఆ ఫార్మాసూటికల్ కంపెనీల నిర్వహకులు హడలిపోయారు. ఈ కేసుల వలన ఆ నాలుగు కంపెనీలు తయారు చేసిన మాత్రల విక్రయాలు పెద్ద ఎత్తున పడిపోయాయని మహిళలు అంటున్నారు.












Click it and Unblock the Notifications