ప్రపంచాన్ని బిత్తరపోయేలా చేసిన 102 ఏళ్ల వృద్ధుడు.. ఏం చేశారంటే ?
చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు ఎప్పుడూ కూడా తమ పనులతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఎప్పటికీ ఎన్నటికీ వెనుదిరగని మనస్తత్వం వారిలో ప్రధానంగా ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఆ కోవ లోనే వయస్సుతో సంబంధం లేకుండా ఏదైనా సాధించవచ్చు అని నిరూపించారు జపాన్కు చెందిన 102 ఏళ్ల కొకిచి అకుజావా.
సాధారణంగా వందేళ్లు దాటిన తర్వాత నడవడం, ఇంట్లో చిన్న పనులు చేయడమే కష్టంగా ఉంటుంది. కానీ అకుజావా అందుకు భిన్నంగా, తన పట్టుదల, ఆత్మవిశ్వాసంతో అనుకున్నది చేసి చూపించారు. 3,776 మీటర్ల ఎత్తున్న మౌంట్ ఫుజిని అధిరోహించారు. అకుజావా సాధించిన ఈ అసాధారణ విజయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా గుర్తించింది. కాగా పర్వతాన్ని ఎక్కిన అత్యంత వృద్ధుడిగా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.

ఈ క్రమంలోనే అకుజావా.. తన పర్వతారోహణ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ. ఎమోషనల్ అయ్యారు. మధ్యలో తాను పర్వతారోహణ ఆపేయాలని భావించానని తెలిపారు. అయితే చుట్టూ ఉన్నవారి ప్రోత్సాహం తనలో ఉన్న పట్టుదల.. 96 ఏళ్ల పర్వతాన్ని అధిరోహించిన అనుభవం ఆయనను ముందుకు నడిపించాయని స్పష్టం చేశారు. ఈ రికార్డుతో అకుజావా మనందరికీ ఒక స్పూర్తిదాయకమైన సందేశం ఇచ్చారనే చెప్పాలి.
అకుజావా గాథ కేవలం ఒక రికార్డు కాదని.. భవిష్యత్ తరాలకు ఒక జీవిత పాఠం అని అంటున్నారు. ఏ కలయినా వయసుతో సంబంధం లేకుండా సాధించవచ్చని.. విఫలమయ్యే భయం కన్నా ప్రయత్నించే ధైర్యం ముఖ్యమనీ సూచిస్తున్నారు. ఆరోగ్యం కాపాడుకుంటే శరీరం ఏ వయసులోనైనా మన కలలకు తోడ్పడుతుందంటున్నారు. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని.. నిజమైన పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు అని ఈ తరహా ఘటనలు మరోసారి రుజువు చేస్తున్నాయి.

అకుజావా జీవితం ఏదైనా పనిని వయస్సు, లేదా ఇతర కారణాలను అడ్డం పెట్టుకుని వాయిదా వేసే వారికి ఒక కనువిప్పు అవుతుందని భావిస్తున్నారు. మనం ఎదుర్కొనే ప్రతి సవాలును అధిగమించడానికి ప్రేరణతో ముందుకు వెళ్తే విజయం మనదే అని గుర్తుచేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications