వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కువైట్లో ప్రమాదం: 15 మంది మృతి, మృతుల్లో అత్యధికులు భారతీయులే
కువైట్: కువైట్లో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడ్డారు. రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ఘోరం చోటు చేసుకొంది.
మరణించినవారిలో ఎక్కువగా భారతీయులే ఉన్నారని అధికారులు చెప్పారు. బుర్గాన్ , హెహిస్కో కంపెనీలకు చెందినవారుగా అధికారులు చెబుతున్నారు.
అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం వాటిల్లింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు.
ఈ ఘటనలో సుమారు నలుగురు కార్మికులు గాయపడ్డారు. కువైట్ కు సమీపంలోని ఏడవ రింగ్ రోడ్డు సమీపంలో ఈ రెండు బస్సులు ఢీకొన్నాయి. సంఘటనస్థలానికి అగ్నిమాపక యంత్రాలను పంపారు. సహయక చర్యలు చేపట్టారు.సంఘటనస్థలంలో రెస్కూ టీమ్ సహయక చర్యలను చేపట్టింది.
Comments
English summary
At least 15 people killed in an accident involving two buses transporting labourers on Artel Highway, north of Kuwait City, according to local reports said.