రెస్టారెంట్ పై ఐఎస్ఐఎస్ దాడి: 19 మంది మృతి
సోమాలియా: సోమాలియా రాజధాని మొగాదీషు నగరంలోని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. రెస్టారెంట్ లో భోజనం చేస్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 19 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు.
సోమాలియా పోలీసు ఉన్నతాధికారి అబ్దుల్ అబిద్ రెహమాన్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. మొగాదీషు నగరంలోని సముద్ర తీరంలో లిడో బీచ్ లో షెబబ్ రెస్టారెంట్ ఉంది. గురువారం రాత్రి ఈ రెస్టారెంట్ లో చాల మంది భోజనం చేస్తున్నారు.

అదే సమయంలో రెస్టారెంట్ ను చుట్టుముట్టిన ఉగ్రవాదులు అన్ని వైపుల నుంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 19 మంది మరణించారు. ఆ ఘటన అత్యంత పాశవికమైన చర్యగా పోలీసు ఉన్నతాధికారి అబ్దుల్ అబిద్ రెహమాన్ అభివర్ణించారు.
ఈ దాడికి తామే భాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (పిబాబ్) ప్రకటించింది. పోలీసుల ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు అంతం అయ్యారని, ఓ ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నామని పోలీసు అధికారి అబ్దుల్ అబిద్ రెహమాన్ తెలిపారు.


Click it and Unblock the Notifications