గాల్లోకి ఎగిరిన కాసేపటికే కుప్పకూలిన విమానం: 19 మంది మృతి
మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. తేలికపాటి విమానం కుప్పకూలడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో మొత్తం 23 మంది ఉన్నారు. తతర్స్థాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రష్యాకు చెందిన ఎల్-410 తేలికపాటి విమానం 21 మంది స్కైడైవింగ్ సభ్యులు, ఇద్దరు సిబ్బందితో బయల్దేరింది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన మెన్సెలిన్క్స్ పట్టణం సమీపంలో చోటుచేసుకుంది. విమానం ఈ ప్రమాదంలో రెండు ముక్కలుగా విరిగిపోయింది.
ప్రమాదానికి ముందు ఈ విమానం రాడార్ల నుంచి అదృశ్యమైంది. ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో ప్రమాదం వెలుగుచూసింది. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను విమాన శిథిలాల నుంచి బయటకి తీసి ఆస్పత్రులకు తరలించారు.
Avião IghtLight L- 410 com 20 paraquedistas e 2 tripulantes caiu no Tartaristão, Rússia. pic.twitter.com/mVoMJXcpbo
— JOO (@Joo00556315) October 10, 2021
Recommended Video
ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఆర్మీ, నేవీలకు స్వచ్ఛందంగా సేవలు అందించే ఓ స్పోర్ట్స్, డిఫెన్స్ సంస్థకు చెందినదిగా ఈ విమానాన్ని గుర్తించారు. ఈ ఏడాది మొదట్లోనూ పలు ఎల్-410 విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు.