అమెరికా స్కూల్లో విద్యార్థి కాల్పులు: ఇద్దరు మృతి

మేరీస్విల్లేపి్చుక్ హైస్కూల్లో జరిగిన ఈ కాల్పుల ఘటన బాధితులంతా పిల్లలే. ముగ్గురి తలలకు గాయాలయ్యాయి. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నాలుగో బాధితుడు స్వల్పంగానే గాయపడ్డాడు. అతన్ని సియాటిల్లోని హర్బోర్వ్యూ సెంటర్కు తరలించారు. గాయపడినవారిలో ఇద్దరు యువకులు కాగా, ఇద్దరు యువతులు.
ఇద్దరు మరణించినట్లు తమకు సమాచారం ఉందని మేరీస్విల్లే పోలీసు కమాండర్ రోబ్ లామౌరెయుక్స్ చెప్పారు. మేరీస్విల్లే సియాటల్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షూటర్ తనను కాల్చుకుని మరణించాడని అధికార వర్గాలు చెప్పాయి. అతను కాల్పులకు తెగబడడానికి కారణం ఏమిటనేది తెలియదని అధికారులు అంటున్నారు.
దాడి చేసిన విద్యార్థి రెజ్లింగ్, ఫుట్బాల్ జట్లలో సభ్యుడని చెప్పారు. ఆ విద్యార్థి లంచ్ సమయంలో కేఫ్టేరియాలోకి ప్రవేశించి తన తరగతి విద్యార్థులపై కాల్పులు జరిపాడని వారన్నారు. అతను వెనక నుంచి వచ్చి ఎనిమిది బుల్లెట్లను కాల్చాడని, వారి వెనక వైవు నుంచి అతను కాల్పులు జరిపాడని వివరించారు.












Click it and Unblock the Notifications