వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాక్ హెమ్ లో జనంపై దూసుకెళ్ళిన ట్రక్కు, 5 గురు మృతి, ఉగ్రదాడి?

స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో జనసమ్మర్థం ఉన్న ప్రాంతంలో జనాన్ని లక్ష్యంగా చేసుకొని ఓ దుండగుడు ట్రక్కును నడిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో జనసమ్మర్థం ఉన్న ప్రాంతంలో జనాన్ని లక్ష్యంగా చేసుకొని ఓ దుండగుడు ట్రక్కును నడిపాడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు.

శుక్రవారం నాడు స్థానిక కాలమాన ప్రకారం ఒంటి గంట సమయంలో స్టాక్ హోమ్ లోని పెద్దదైన స్టోర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకొంది.

truck driver

స్టాక్ హోమ్ లో జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జనాన్ని లక్ష్యంగా చేసుకొని ఓ వ్యక్తి ట్రక్కును నడిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు.

సంఘటన స్థలం వద్ద భీతవాహ పరిస్థితులు నెలకొన్నాయి. దట్టమైన పొగ అలముకొంది.అయితే ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారనే విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు.

హెలిక్యాప్టర్ల సహయంతో ఈ ప్రాంతాన్ని పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు.క్షతగాత్రులకు సహయం అందించేందుకుగాను పెద్ద ఎత్తున అంబులెన్స్ లను సంఘటన స్థలానికి చేర్చారు.

అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఉగ్రదాడి ఇంకా ఇతర కారణాలు ఉన్నాయా అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.మరో వైపు ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారని స్వీడీష్ రేడియో ప్రకటించింది.అయితే ఈ ఘటన సెకన్ల వ్యవధిలో ముగిసిందని స్వీడీష్ రేడియో ప్రకటించింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

అయితే దొంగిలించిన ట్రక్కును తీసుకొచ్చి ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.లేదా ట్రక్కును స్పెండ్రాప్స్ బ్రేవరీస్ నుండి హైజాక్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
A van drove into a crowd of people outside a busy department store in central Stockholm on Friday, injuring people, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X