వైద్యరంగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ (వీడియో)
స్టాక్హొం: ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురు శాస్త్రవేత్తలకు లభించింది. వైద్యరంగంలో విశిష్ట కృషికి గాను ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ పురస్కారం వరించింది. విలియమ్ సి.క్యాంబెల్ (ఐరిష్), సతోషి ఒమురా (జపాన్), య్యూయు తు (చైనా) లకు ఈ పురస్కారం దక్కింది.
మలేరియా, తామరపై వీరు చేసిన పరిశోధనలకుగాను వారికి ఈ గౌరవం దక్కినట్లు నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది. దోమలు, ఈగలు వల్ల మానవ రక్తంలో ప్రవేశించే బ్యాక్టీరియా, ఏలికపాము లాంటి పరాన్న జీవుల కారణంగా సంక్రమించే బోదకాలు, అంధత్వం నయంచేసేందుకు డ్రగ్ను కనుగొన్నందుకుగాను విలియమ్ సి.క్యాంబెల్, సతోషి ఒమురాలకు సంయుక్తంగా సగం నోబెల్ ప్రైజ్ లభించింది.

మలేరియాను అరికట్టే మెడిసిన్ 'ఆర్టేమిసినిన్'ను కనుగొన్న చైనాకు చెందిన మహిశా శాస్త్రవేత్త య్యూయు తునకు మిగతా సగం నోబెల్ ప్రైజ్ మనీ ఇవ్వాలని అవార్డు కమిటీ నిర్ణయించింది. చైనా అకాడమీ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్' విభాగంలో పనిచేస్తూ చైనా సంప్రదాయ ఔషధ మొక్కల నుంచి ‘ఆర్టెమెసినిన్' అనే డ్రగ్ను 84 ఏళ్ల య్యూయు తు కనుగొన్నారు.
1930లో జన్మించిన ఆమె 1967లో మావో జెడాంగ్ ఏర్పాటు చేసిన మలేరియా డ్రగ్ ప్రాజెక్టులో చేరారు. అప్పట్లో ఈ ప్రాజెక్టును 523 అని పిలిచేవారు. రహస్యంగా జరిగిన ఈ పరిశోధనల్లో ఆమె స్వయంగా శరీరంలోకి మలేరియా పరాన్న జీవిని ఎక్కించుకున్నారు. తన ఏకైక కూతురును నర్సరీ హోంలో వదిలేసి ప్రాజెక్టులో పాల్గొన్నారు.

ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట డిసెంబర్ 10న ఆయన వర్ధంతి సందర్భంగా స్వీడిష్ అకాడమీ ఈ బహుమతులను అందజేస్తున్న సంగతి తెలిసిందే.
LIVE STREAM Announcement of the 2015 #NobelPrize #Medicine – join the excitement in Stockholm! https://t.co/HHbVGAdwSi
— The Nobel Prize (@NobelPrize) October 5, 2015 -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications