వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యెమెన్‌లో కారు బాంబు పేలుడు: 30 మంది మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యెమెన్ దేశ రాజధాని సనాలో ఉగ్రవాదులు కారు బాంబును పేల్చారు. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా... 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

సనాలోని స్ధానిక పోలీసు కళాశాల ఎదుట ఈ సంఘటన జరిగింది. ఇది ఇలా ఉంటే ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్ధా ప్రకటించుకోలేదు. ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఈ ఘటనలో గాయపడ్డ వారిని అంబులెన్స్ ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆల్‌ఖైదా తన కార్యకలాపాలను వేగవంతం చేసి ఉగ్రవాద దాడులకు పాల్పడుతుందని యెమెన్ హోం మంత్రి ఆరోపణలు చేశారు.

గత వారం యెమెన్‌లోని సౌత్ వెస్ట్ కల్చరల్ సెంటర్ సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారుగా 33 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇప్పడు ఆ ఘటన నుంచి తేరుకోక ముందే ఈ కారు బాంబు పేలుడు ఘటన స్ధానికుల్లో భయాందోళనను కలగజేస్తుంది.

English summary
A car bomb exploded outside a Yemeni police college in Sanaa on Wednesday, killing 31 people and wounding dozens, the interior ministry said, less than a week after a devastating suicide bombing south of the capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X