పేలుళ్లతో దద్దరిల్లిన ఆఫ్గాన్: 56మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్ మంగళవారం ఉగ్రవాదుల బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. మూడు పేలుళ్లలో 56 మంది మృతిచెందగా, వందమందికిపైగా గాయపడ్డారు.
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ మంగళవారం ఉగ్రవాదుల బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. మూడు పేలుళ్లలో 56 మంది మృతిచెందగా, వందమందికిపైగా గాయపడ్డారు. కాబూల్లోని పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో జరిగిన రెండు పేలుళ్లలో 38 మంది ప్రాణాలు కోల్పోగా, ఒక ఎంపీ సహా 72 మంది గాయపడ్డారు.
మొదట ఆత్మాహుతి దాడి, తర్వాత కారు బాంబు దాడి జరిగాయి. మృతుల్లో పలువురు పౌరులు, జవాన్లు ఉన్నారు. తామే దాడులు చేశామని తాలిబాన్ ప్రకటించింది. ఇది ఇలా ఉండగా, హెల్మాంద్ రాష్ట్ర రాజధాని లష్కర్ ఘాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏడుగురు చనిపోయారు.

కాగా, కాందహార్ రాష్ట్ర గవర్నర్ భవన ప్రాంగణంలో జరిగిన మరో పేలుడులో 9 మంది చనిపోగా, యూఏఈ రాయబారి అబ్దుల్లా కాబీ సహా 16 మంది గాయపడ్డారు. పేలుళ్ల ఘటనాస్థలాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
More From
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications