యెమెన్లో వైమానిక దాడులు: 40 మంది మృతి
సనా: యెమెన్లో సౌదీ అరేబియా నేతృత్వంలో గత 24 గంటల్లో జరిపిన వైమానిక దాడుల్లో 40 మంది మృతిచెందారు. యెమెన్ సెంట్రల్ ప్రావిన్స్ బైడాలో తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్న ముకైరిస్ నగరంపై దాడి చేసి తిరిగి ప్రభుత్వ మద్దతుదారులు నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో 19 మంది తిరుగుబాటు దారులు, 15 మంది వారి మద్దతుదారులు, ఆరుగురు సాధారణ పౌరులు మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. బైడా ప్రావిన్స్లో సౌదీ ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్నాయి.
గ్యాస్ కంపెనీలో విస్ఫోటం : 11 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్లోని హెరత్ నగరంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ కంపెనీలో భారీ విస్ఫోటం సంభవించడంతో 11 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు.
సదరు కంపెనీలో ద్రవరూపంలో గ్యాస్ని నిల్వ ఉంచడంతో ప్రమాదవశాత్తు విస్ఫోటం చోటు చేసుకుందని తెలిపారు. ఈ ప్రమాదంలో అగ్నికీలలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల నివాసాలకు మంటలు వ్యాపించాయని పేర్కొన్నారు.
క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications