రైలు పట్టాలపై తోసి ఇండియన్ హత్య: అమెరికన్ మహిళకు 24ఏళ్ల జైలు
న్యూయార్క్: ఓ భారతీయుడ్ని రైలు పట్టాలపై తోసేసి అతని మరణానికి కారణమైన అమెరికన్ మహిళకు అక్కడి న్యాయస్థానం 24ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ ఘటన న్యూయార్క్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సునందో సేన్(46) అనే భారతీయుడిని రైలు పట్టాలపైకి తోసి చంపేసిన ఘటనలో అమెరికన్ మహిళ ఎరికా మెనెన్డెజ్కు 24ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
2012, డిసెంబర్ 27న న్యూయార్క్లోని సబ్వే స్టేషన్లో రైలు వస్తున్న సమయంలో ఎరికా సునందో సేన్ను పట్టాలపైకి తోసేసింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన క్వీన్స్ సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో ఎరికాను దోషిగా ప్రకటించింది.

కాగా, ఇప్పుడు 24ఏళ్ల శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించిందని ఫాక్స్ న్యూస్ తన కథనంలో పేర్కొంది. గతంలో కోర్టు విచారణ సమయంలో ఎరికాను ఎన్ని సార్లు ప్రశ్నించినా తను ఎందుకు అతడిని రైలు పట్టాలపైకి తోసేసిందో గుర్తులేదని చెప్పింది.
అరెస్టయిన అనంతరం పోలీసులతో.. తనకు హిందువులన్నా, ముస్లింలన్నా ద్వేషమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయమై జడ్జి ఆమెను తీవ్రంగా ప్రశ్నించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications