200 మందికి ఎయిడ్స్ ఎక్కించాడు: 25 ఏళ్ల జైలు
పినోమ్ పెన్: వైద్యం చేయించుకుందామని వెళ్లిన వారు ఇప్పుడు ఎయిడ్స్ వ్యాపించి మృత్యువుతో పోరాడుతున్నారు. ఎలాంటి అనుభవం లేకుండా, వైద్య విద్యను అభ్యసించకుండానే ఆ కిరాతకుడు 200 మందికి ఎయిడ్స్ రావడానికి కారణం అయ్యాడు.
యెమ్ చరిన్ (57) అనే కిరాతకుడికి గురువారం కాంబోడియా కోర్టు 25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బట్టామాబాంగ్ ఫ్రావిన్స్ లోని రేఖా అనే ప్రాంతంలో గ్రామీణ తెగల వారు నివాసం ఉంటున్నారు. యెమ్ చరిన్ వారికి వైద్యం చేసి డబ్బు సంపాధించాలని ప్లాన్ వేశాడు.
అనుకున్నట్లు గానే ఆ తెగల వారిని నమ్మించి వారికి వచ్చిరాని వైద్యం చెయ్యడం మొదలు పెట్టాడు. 15 నుంచి 50 ఏళ్లలోపు వారికి వైద్యం చేశాడు. అయితే అందరికి ఒకే నీడిల్ (సిరంజ్) ఉపయోగించి సూది వేశాడు.

ఇలా ఒకరికి ఉపయోగించిన నీడిల్ మరొకరికి ఉపయోగించడం వలన అందరికి హెచ్ఐవీ వ్యాపించింది. ఇప్పటికే 10 మంది మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆరా తీశారు. ఇంత జరగడానికి కారణం యెమ్ చరిన్ అని గుర్తించారు.
2014 చివరిలో అతనిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతున్నది. 200 మందికి పైగా హెచ్ఐవీ వ్యాపించిందని వెలుగు చూసింది. అందరి ప్రాణాలతో చెలగాటం ఆడుకున్న యెమ్ చరిన్ కు 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications