పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పండి: ఆర్మీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సరిహద్దుల్లో నిత్యం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. నిర్దాక్షిణ్యంగా ప్రజల ప్రాణాలు తీస్తున్నారు పాక్ నుంచి వస్తున్న ఉగ్రవాదులు.
నిత్యం కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తున్న పాక్కు గట్టి బుద్ధి చెప్పేందుకు సరిహద్దులోని సైనిక అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు సైనిక వర్గాలు చెప్పాయి.

పాక్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా దీటైన సమాధానమిచ్చేలా చర్యలు తీసుకోవచ్చని నియంత్రణ రేఖ వద్ద ఉండే కమాండర్స్కు మౌఖిక అనుమతినిచ్చారు.
ఇటీవల కాలంలో పాకిస్థాన్ కాల్పులతో సైనికుల, పౌరుల ప్రాణాలు కోల్పొతున్నారు. ఇకపై దీన్ని సహించడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని భావించిన ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications