పాకిస్తాన్లో వరుస పేలుళ్లు: 10 మంది మృతి
కరాచీ: పాకిస్తాన్లో మంగళవారం నాడు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పదిమంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. మరికొందరు ఆయిల్ ట్యాంకర్లో చిక్కుకు పోయినట్లుగా తెలుస్తోంది. ఈ సంఘటన పాక్లోని దక్షిణ బెలూచిస్థాన్లో జరిగింది.
వరుస పేలుళ్లు జరిగాయి. కాలం చెల్లిన నౌకలను విచ్ఛిన్నం చేసే ప్రాంతంలో ఓ ఆయిల్ ట్యాంకర్ కారణంగా ఈ పేలుళ్లు సంభవించినట్టు గుర్తించారు. పేలుళ్లు జరిగిన సమయంలో గద్దాని షిప్ బ్రేకింగ్ యార్డులో వంద మంది కార్మికులు పని చేస్తున్నారు.

వీరిలో 30 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని చెబుతున్నారు. కొంతమంది నౌకలో చిక్కుకుని ఉంటారని, ప్రమాద సమయంలో మరికొందరు సముద్రంలో దూకి ఉండవచ్చని తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో అగ్నిమాపక యంత్రాలు, సంబంధిత సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉండవచ్చునని భావిస్తున్నారు. నౌకలో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఎనిమిది వరుస పేలుళ్లు సంభవించినట్లుగా తెలుస్తోంది.
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications