కారు బాంబు దాడి, 25 మంది దుర్మరణం
కాబుల్: నాటో సంస్థను, మిలటరీ క్యాంపు కార్యాలయాన్ని టార్గెట్ చేసుకుని కారు బాంబు పేలుడు జరపడంతో 25 మంది సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన సంఘటన అఫ్ఘనిస్థాన్ లో జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన అనేక మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆఫ్ఘనిస్థాన్ లోని కోస్ట్ సిటిలో చాప్ మాన్ క్యాంపు వద్ద నిత్యం రద్దిగా ఉండే రోడ్డులో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఒక కారు దూసుకు వెళ్లింది. నాటో క్యాంపు దగ్గర ఉన్న సైనికులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి చేసేందుకు ప్రయత్నించారు.

అయితే సైనికులు అడ్డుకోవడంతో కారులో ఉన్న వ్యక్తి అందులో ఉన్న బాంబులు పేల్చి వేశాడు. పరిసర ప్రాంతాలలో ఉన్న 20 మంది సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. తీవ్రగాయాలైన 21 మందిని కోస్ట్ సిటి ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో ఐదు మంది మరణించారు. ఈ ఆత్మాహుతి దాడిలో సైనికులు ఎవరు మరణించలేదని పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటికి వరకు దాడికి పాల్పడింది తామేనని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. తాలిబన్ ఆత్మాహుతి దాడులకు పాల్పడి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications