భారతీయుడిపై జాత్యహంకార దాడి: ఖండించిన ఆస్రేలియా..
ఈ ఘటనపై ఆస్రేలియా హైకమిషన్ తాజాగా స్పందించింది. ఇలాంటి దాడి విచారకరమని, దీన్ని ఖండిస్తున్నామని ప్రకటించింది.
మెల్బోర్న్: కేరళలోని కొట్టాయం జిల్లా పుత్తుప్పల్లికి చెందిన లీ మ్యాక్స్ జాయ్ అనే యువకుడిపై ఆస్ట్రేలియాలో విద్వేష దాడి జరిగిన సంగతి తెలిసిందే. స్థానికంగా నర్సింగ్ కోర్సు చేస్తూ ట్యాక్సీ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్న అతనిపై స్థానిక ఆస్ట్రేలియన్లు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.
మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ లో ఓ మహిళ సహా ఐదుగురు వ్యక్తులు 'బ్లడీ బ్లాక్ ఇండియన్స్' అంటూ అతడిపై నోరు పారేసుకున్నారు. విషయం పోలీసుల దాకా వెళ్లడంతో.. వారు రెస్టారెంట్ వద్దకు చేరుకునేలోపే దుండగులు మ్యాక్స్ను తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. ఈ ఘటనపై ఆస్రేలియా హైకమిషన్ తాజాగా స్పందించింది. ఇలాంటి దాడి విచారకరమని, దీన్ని ఖండిస్తున్నామని ప్రకటించింది.

దాడిలో స్వల్పగాయాల పాలైన భారతీయుడు ప్రస్తుతం రాయల్ హోబర్ట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. దాడిని తీవ్రంగా పరిగణించిన టాస్మానియా పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రకటించారు. భారతీయుడిపై దాడి వెనుక జాత్యహంకార కోణం ఉందా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్నది విచారణలో తేలనుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications