షేక్ హసీనా వ్యాఖ్యలపై బంగ్లా ఫైర్..! నిరసనల హెచ్చరికలు..!
బంగ్లాదేశ్ (bangladesh) నుంచి పారిపోయి వచ్చి భారత్ లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తాజాగా స్వదేశంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆడియో మెసేజ్ ద్వారా ఆమె ప్రసంగించారు. ఇందులో బంగ్లాలో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ భారత్ కు సందేశం పంపింది.
పరారీలో ఉన్న మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా న్యూఢిల్లీలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రసంగించడానికి అనుమతించడం ఆశ్చర్యకరంగా, దిగ్భ్రాంతికరంగా ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఆమె వ్యాఖ్యలు బంగ్లాదేశ్ శాంతి, భద్రత, ప్రజాస్వామ్య పరివర్తనకు ముప్పు కలిగిస్తున్నాయని ఆరోపించింది. ఢాకాలో విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో.. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ దోషిగా నిర్ధారించిన హసీనా.. బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని తొలగించాలని బహిరంగంగా పిలుపునిచ్చినట్లు తెలిపింది.

బంగ్లాదేశ్లో రాబోయే సార్వత్రిక ఎన్నికలను పక్కదారి పట్టించడానికి తన పార్టీ విశ్వాసపాత్రులను, సాధారణ ప్రజలను ఉగ్రవాద చర్యలకు ప్రేరేపించిందని ప్రభుత్వం పేర్కొంది. ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం పదేపదే అభ్యర్థించినప్పటికీ భారతదేశం హసీనాను అప్పగించకపోవడం పట్ల బంగ్లాదేశ్ తీవ్రంగా బాధపడుతోందని వెల్లడించింది. బదులుగా ఆమె భారత భూభాగం నుండి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడానికి అనుమతించబడడాన్ని తప్పుబట్టింది. ఇది బంగ్లాదేశ్ యొక్క ప్రజాస్వామ్య పరివర్తన, శాంతి, భద్రతను స్పష్టంగా ప్రమాదంలో పడేస్తుందని ఆరోపించింది.












Click it and Unblock the Notifications