Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మసీదులో ప్రార్థన టైంలో ఆత్మహుతి దాడి: పాకిస్తాన్‌లో 22 మంది మృతి!

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో దారుణం జరిగింది. ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. మహ్మద్ ట్రైబల్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ సూసైడ్ బాంబు దాడిలో 22 మంది వరకు మృతి చెందారని తెలుస్తోంది. మరో 35 మంది గాయపడ్డారు.

శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ఓ దుండగుడు మసీదులోకి చొరబడ్డాడు. అనంతరం తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆప్ఘనిస్తాన్ సరిహద్దులోని పేయిఖాన్ అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

Pakistan

అక్బర్ అనే అధికారి మాట్లాడుతూ.. 20 మందికి పైగా గాయపడ్డారని, ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ వారిని పెషావర్ ఆసుపత్రికి విమానంలో తరలించినట్లు చెప్పారు. ఈ దాడిని జమాత్ ఉల్ అహ్రర్ అనే ఉగ్రసంస్థ చేసినట్లుగా ప్రకటించింది. ఇది పాక్ తాలిబన్ గ్రూప్ సంస్థ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+