ప్రధానమంత్రికి కరోనా తీవ్రం: హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు: హోమ్ క్వారంటైన్లో గడిపి..
లండన్: ప్రాణాంతక కరోనా వైరస్ లక్షణాలతో మొన్నటి దాకా హోమ్ క్వారంటైన్లో గడిపిన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడం.. దగ్గు, జలుబు, జ్వరం, తగ్గకపోవడం వల్ల ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయనను ఏ ఆసుపత్రిలో చేర్చారనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. భద్రతా కారణాల వల్లే ఆసుపత్రి పేరు, ఇతర వివరాలను గోప్యంగా ఉంచినట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.

10 రోజులుగా హోమ్ క్వారంటైన్..
బోరిస్ జాన్సన్ 10 రోజుల కిందట అనారోగ్యానికి గురయ్యారు. దగ్గు, జ్వరం రావడంతో ఆయన విధులకు హాజరు కాలేదు. హోమ్ క్వారంటైన్లో కాలం గడిపారు. ఇంట్లోనే ఉంటూ వైద్య చికిత్సను అందించారు. 10 రోజుల తరువాత కూడా ఆయనకు జ్వరం తగ్గుముఖం పట్టకపోగా.. మరింత తీవ్రతరం అయ్యాయి. దీనితో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఆసుపత్రి వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు.

డాక్టర్ల సలహాల వల్లే..
డాక్టర్ల సలహా మేరకు తాము ప్రధానమంత్రిని ఆసుపత్రికి తరలించినట్లు డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఆదివారం రాత్రి ఆయనను ఆసుపత్రిలో చేర్చామని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయన ఎప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని అన్నారు. డాక్టర్లు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు.

అత్యవసర తరలింపు కాదంటూ వివరణ..
బోరిస్ జాన్సన్ను రాత్రికి రాత్రి హుటాహుటిన ఆసుపత్రికి చేర్చడం పట్ల ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆయనే ప్రధానమంత్రి వ్యవహరిస్తున్నారని, హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పటికీ.. వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా అధికారిక కార్యకలాపాలను పర్యవేక్షించారనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రధానమంత్రి బాధ్యతలను మరొకరికి అప్పగించాలనే విషయంపై ఎలాంటి చర్చా జరగలేదని చెప్పారు.

డొమినిక్ రాబ్కు ప్రధాని బాధ్యతలు..
బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి విషమించడమంటూ జరిగితే.. ఆయన బాధ్యతలను డొమినిక్ రాబ్కు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయనను డిజిగ్నేటెడ్ మినిస్టర్గా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. బ్రిటన్ కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం 9:15 నిమిషాలకు ఆయన బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బోరిస్ జాన్సన్ భార్యకు కూడా..
బోరిస్ జాన్సన్ భార్య క్యారీ సిమండ్స్ కూడా అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు కూడా కరోనా వైరస్ సోకి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, వైరస్ నుంచి కోలుకున్నానంటూ క్యారీ సిమండ్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె గర్భంతో ఉన్నారు. యుకేలో ఇప్పటికే కరోనా వైరస్ వల్ల 4934 మంది మరణించారు. 47,806 మందిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. వారంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొందరు ప్రముఖులు హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications