వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థాయ్‌లాండ్‌లో బస్సు ప్రమాదం: 20 మంది సజీవ దహనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌ సరిహద్దు నుంచి బ్యాంకాక్‌ వైపు వెళ్తున్న ఓ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది సజీవ దహనమయ్యారు. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో సుమారు 47 మంది ప్రయాణీకులున్నారు.

థాయ్‌లాండ్ నుండి బ్యాంకాక్ వైపు వెళ్తున్న బస్సులో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకొంది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణీకులు ఉన్నారు.థాయ్‌లాండ్‌లోని వాయువ్య టాక్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకొంది.

Bus fire kills 20 Myanmar migrants in Thailand

బస్సులో చీకటిగా ఉండడం వల్లే ప్రయాణీకులు బస్సు నుండి బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దీంతోనే మృతుల సంఖ్య ఇంకా పెరిగిందని ప్రత్యక్షసాక్షులు అభిప్రాయపడ్డారు.

మృతులంతా మయన్మార్ ‌కు చెందిన వలస కార్మికులే. ఘటనాస్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అనంతరం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.

English summary
Twenty Myanmar migrant workers died early Friday (March 30) as fire tore through a bus taking them from a Thai border town to Bangkok, officials said.It was not immediately clear how the blaze started on the bus - one of four travelling together to the Thai capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X