దావుద్ను ఎక్కడి నుంచి తెచ్చి పట్టివ్వగలం: పాక్
ఇస్లామాబాద్: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని, కాబట్టి ఆయనను తాము భారత్కు ఎలా అప్పగించగలమని పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ శనివారం నాడు స్పష్టం చేశాడు.
దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లో లేడని అవన్నీ అవాస్తవమైన వ్యాఖ్యలన్నాడు. అతడు ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని చెప్పాడు. లేనివాడిని ఎక్కడి నుంచి తెచ్చి భారత్కు అప్పగించాలని ప్రశ్నించాడు. కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో దావూద్ తలదాచుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
దావూద్ను భారత్కు అప్పగించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని కేంద్రం ప్రకటించింది. దీంతో పాటు దావూద్ ఇంటి నుంచి మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సేకు తరచూ ఫోన్కాల్స్ వస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ఖడ్సే ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు.