మమ్మల్ని ఎదుర్కొనేందుకే: భారత్-అమెరికా సంబంధాలపై చైనా అక్కసు, హెచ్చరిక
భారత్ - అమెరికా సంబంధాలపై చైనా మీడియా తన అక్కసు వెళ్లగక్కింది. భారత్ ఎదగడాన్ని వాషింగ్టన్ ఏమాత్రం అంగీకరించదని చైనా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.భారత్ - అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను చైనా ఎంతమాత్
బీజింగ్: భారత్ - అమెరికా సంబంధాలపై చైనా మీడియా తన అక్కసు వెళ్లగక్కింది. భారత్ ఎదగడాన్ని వాషింగ్టన్ ఏమాత్రం అంగీకరించదని చైనా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
శ్రీలంక నుంచి వ్యూహం, డ్రాగన్కు చెక్: చైనాకు భారత్ దిమ్మతిరిగే షాక్
భారత్ - అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను చైనా ఎంతమాత్రం వ్యతిరేకించదని ఓ వైపు చెబుతూనే, మరోవైపు తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని ఆ కథనంలో పేర్కొంది.
చైనాను ఎదుర్కొనేందుకు భారత్ను ఉపయోగించుకుంటోంది
బీజింగ్ను ఎదుర్కొనేందుకు భారత్ను ఉపయోగించుకోవాలని అమెరికా భావిస్తోందని, భారత్-చైనా మధ్య ఉన్న విబేధాలను అడ్డంపెట్టుకొని అమెరికా లబ్ధి పొందాలని భావిస్తోందని పేర్కొంది.
వాషింగ్టన్ ఏ దేశాన్ని ఎదగనివ్వదు
భారత్ ఒకింత ఒత్తిడికి లోనవుతోందని, చైనాతో దూరం పెరిగిపోతోందని ఆ దేశం ఆందోళన చెందుతోందని, వాషింగ్టన్ ఏ దేశాన్ని శక్తిమంతంగా ఎదగనివ్వదు, అది చైనా అయినా భారత్ అయినా కావొచ్చునని పేర్కొంది.
అమెరికా లక్ష్యంగా విమర్శలు
భారత్-చైనా మధ్య ఇటీవల నెలకొన్న డోక్లాం ప్రతిష్టంభన సమయంలో కూడా డ్రాగన్ అమెరికాను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసింది.
రెక్స్ టిల్లర్సన్ చెప్పిన రెండు రోజులకే
కాగా, అమెరికాకు భారత్ విశ్వసనీయమైన భాగస్వామి అని, మరో శతాబ్దమైనా ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు ఉంటాయని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్సన్ వ్యాఖ్యానించిన రెండు రోజుల వ్యవధిలోనే చైనా తన అక్కసును వెళ్లగక్కింది. టిల్లర్సన్ బుధవారం భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను ప్రశంసిస్తూనే చైనాకు చురకలేశారు. దక్షిణ చైనా సముద్రంపై అధిపత్యం కోసం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు.