Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..

భారత్ 9 దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. వీటిలో 7 దేశాలతో అంటే పాకిస్థాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, అఫ్గానిస్తాన్ లతో భూ సరిహద్దును అలాగే శ్రీలంక, మాల్దీవులతో సముద్ర సరిహద్దును పంచుకుంటోంది. ఇక బంగ్లాదేశ్‌ తో అత్యంత పొడవైన భూ సరిహద్దును భారత్ కలిగి ఉన్న విషయం తెలిసిందే. అయితే భారత్ తో భూ సరిహద్దు పంచుకునే దేశాల నుండి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)పై 2020 నిబంధనలను కేంద్ర మంత్రివర్గం తాజాగా సవరించింది.

మార్చి 10, 2026న కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులను ప్రకటించింది. ఈ సవరణ beneficial ownership అనే కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. భూ సరిహద్దు దేశాల కంపెనీలు భారతీయ సంస్థలలో నియంత్రణ లేని వాటా కలిగి ఉంటే.. ప్రభుత్వ అనుమతి లేకుండా పెట్టుబడులు పెట్టొచ్చు. 2020 నాటి 'ప్రెస్ నోట్ 3' ప్రకారం.. సరిహద్దు దేశాల కంపెనీలు భారత్ లో పెట్టుబడి పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అంతకుముందు ఈ నిబంధన బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ లకు మాత్రమే వర్తించేది. కానీ 2020లో ఇది అన్ని సరిహద్దు దేశాలకూ వర్తింపజేసింది. దాంతో భారత్ లో చైనా అతిపెద్ద పెట్టుబడిదారుగా నిలిచింది. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఈ మార్గదర్శకాలకు ఆమోదం తెలిపింది.

ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం "భూ సరిహద్దు దేశాలకు చెందిన వాస్తవ యజమానిత్వం 10 శాతం వరకు నియంత్రణ లేని వాటా కలిగిన పెట్టుబడిదారులను వర్తించే రంగాల పరిమితులు, ప్రవేశ మార్గాలు, అనుబంధ షరతులకు లోబడి ఆటోమేటిక్ మార్గం ద్వారా అనుమతిస్తారు." "అలాంటి పెట్టుబడులకు సంబంధించిన సమాచారం.. వివరాలను పెట్టుబడి గ్రహీత సంస్థ తప్పనిసరిగా పరిశ్రమల అభివృద్ధి, అంతర్గత వాణిజ్య శాఖ (డీపీఐఐటీ)కి నివేదించాలి." ఎలక్ట్రానిక్ పెట్టుబడి వస్తువులు, విడిభాగాలు, పాలిసిలికాన్ వంటి నిర్దిష్ట రంగాలలో పెట్టుబడి ప్రతిపాదనలను 60 రోజులలోపు ప్రాసెస్ చేసి నిర్ణయిస్తారు.

ఇంగోట్- వేఫర్ వంటి ఇతర ప్రత్యేక రంగాల జాబితాను క్యాబినెట్ కార్యదర్శి ఆధ్వర్యంలోని కార్యదర్శుల కమిటీ సమీక్షించి సవరించవచ్చు. "ఈ సందర్భాలలో, పెట్టుబడి గ్రహీత సంస్థ మెజారిటీ వాటా, నియంత్రణ ఎల్లప్పుడూ నివాస భారతీయుడికి/సంస్థలకే చెందుతుంది" అని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త మార్గదర్శకాలు దేశంలో వ్యాపార సౌలభ్యం, స్పష్టతను పెంచుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇది ఎఫ్‌డీఐ, కొత్త సాంకేతికతలు, దేశీయ విలువ జోడింపు, స్థానిక సంస్థల విస్తరణ, ప్రపంచ సరఫరా గొలుసులతో ఏకీకరణకు దోహదపడుతుందని పేర్కొంది. దేశ పోటీతత్వాన్ని పెంచుతుందని కూడా అభిప్రాయపడింది.

China Investments Boost in India Central government now Eases Key Restrictions for FDI amp amp Projects
వాణిజ్య మంత్రిత్వ శాఖలోని ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ "దీనికి ఒక లాజిక్ ఉంది. భారత్ కు మూలధనం, చైనాలో అధిక ఉత్పత్తి సామర్థ్యం ఉండటం వలన వ్యూహాత్మక పరిగణనలను కొనసాగిస్తూనే ఆంక్షలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది" అని వివరించారు. రహదారులు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల వంటి రంగాలలో వ్యూహాత్మక లేదా డేటా సార్వభౌమత్వ సమస్యలు అంత తీవ్రంగా లేవని ఆయన అన్నారు. "చైనాకు భారీ విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. వారు ప్రస్తుతం అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడులు పెడుతుండగా, భారత్ వారికి మంచి రాబడిని అందించగలదు" అని ఆ అధికారి తెలిపారు.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+