సుష్మా గర్విష్టి, పాక్ దుష్ట దేశమా? ఇండియా ఏమైనా ఐటీ సూపర్ పవరా?: చైనా అక్కసు
భారత్పై తన అక్కసును చైనా మీడియా మరోసారి వెళ్లగక్కింది. పాక్ ఉగ్రవాదులను ఎగుమతి చేస్తున్న దేశంగా అభివర్ణించడం రాజకీయంగా అసంబద్ధమైన చర్యగా పేర్కొంది.
బీజింగ్: భారత్పై తన అక్కసును చైనా మీడియా మరోసారి వెళ్లగక్కింది. అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ తీరును ఐరాస వేదికగా భారత్ ఎండగట్టిన సంగతి తెలిసిందే.
పాక్ ఉగ్రవాదులను ఎగుమతి చేస్తున్న దేశంగా అభివర్ణించడం రాజకీయంగా అసంబద్ధమైన చర్యగా పేర్కొంది. చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో ఈ మేరకు పేర్కొంది.

సుష్మా స్వరాజ్ గర్విష్టి...
ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం ఇస్తోందంటూ భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడంపై చైనా పత్రిక విమర్శలు గుప్పించింది. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ను గర్విష్టిగా అభివర్ణించింది.

తీవ్రవాదం అణిచివేతలో పాక్...
‘పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా భారత పాలకులు పేర్కొనడం రాజకీయంగా వారి దుర్భల మనస్తత్వానికి, అసంబద్ధతకు నిదర్శనం. టెర్రరిజాన్ని అంతమొందించేందుకు పాక్ తన సర్వశక్తులు ఒడ్డుతోంది. వారి చారిత్రక వివాదాలతో టెర్రరిజాన్ని కలగాపులగం చేయొద్దు..' అంటూ గ్లోబల్ టైమ్స్ రాసుకొచ్చింది.

పాకిస్తాన్ కి లాభమేముంది?
‘పాకిస్తాన్లో ఉగ్రవాదం ఉన్న మాట వాస్తవమే. అదేమైనా వారి జాతీయ విధానామా? ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం ద్వారా పాక్ డబ్బు.. గౌరవం.. పొందుతోందా? ఇస్లామాబాద్ ఒక్కటే ఉగ్రవాదులకు స్థావరం కాదనే విషయాన్ని భారత్తో సహా అమెరికా మిగిలిన దేశాలు గుర్తించాలని చెప్పుకొచ్చింది. పాకిస్థాన్పై దురభిమానం కలిగి ఉండటం ప్రపంచశక్తిగా ఎదగాలనుకొంటున్న భారత్కు సరిపోదని వ్యాఖ్యానించింది.

ఇండియా ఐటీ సూపర్ పవరా?
పాకిస్తాన్ ను దుష్ట దేశంగా అభివర్ణించే భారత్ ఏమైనా సుశిక్షతులైన ఇంజినీర్లు, డాక్టర్లను అందిస్తున్న నిజమైన ఐటీ సూపర్ పవరా?' అంటూ చైనా అధికార పత్రిక ప్రశ్నించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగానైతే ‘అమెరికా ఫస్ట్' అనే నినాదాన్ని ఇచ్చారో.. ‘ఇండియా ఫస్ట్' అనే నినాదాన్ని ఇవ్వడం ద్వారా భారతీయుల్లో జాతీయవాదాన్ని రగలించాలంది.

పాక్ ను గౌరవించండి.. మాతో స్నేహంగా ఉండండి...
‘కొంత కాలంగా భారత ఆర్థిక వ్యవస్థ, విదేశాలతో సత్సంబంధాలు స్థిరంగా, సానుకూలంగా ఉన్నాయి. అయితే తన దురంహకారంతో పాకిస్తాన్ను చిన్న చూపుచూస్తోంది. చైనాను అహంకారిగా భావిస్తోంది. అమెరికా, యూరప్లపై ప్రేమను కనబరుస్తూ పొరుగు దేశాలను చూసి భయపడుతోంది. ఇక మీ తెలివితేటలు చాలు.. చైనాతో స్నేహంగా ఉంటూ, పాకిస్తాన్ను గౌరవించండి. వివాదాలను పక్కకు పెట్టి, దౌత్యపరంగా సరిహద్దుల వద్ద సుహృద్భావంతో వ్యవహరించాలి. భారత్ను అడ్డుకోవాలనే కాంక్ష చైనాకు లేదు. నిజాయతీగా చెప్పాలంటే అది చైనాకు కూడా మంచిదికాదు.' అంటూ గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో పేర్కొంది.
-
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications