పాకిస్తాన్ను చైనా ఒప్పించగలదు: వైట్ హౌస్ అధికారి
వాషింగ్టన్: ఉగ్రవాదులపై పోరుకు పాకిస్థాన్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా - పాక్ దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఉగ్రవాదంపై పోరాటం చేసేందుకు పాకిస్తాన్ను చైనా ఒప్పించగలదని వైట్ హౌస్ అధికారి ఒకరు చెప్పారు.
పాకిస్థాన్, చైనాకు మధ్య గత కొన్నేళ్లుగా చరిత్రాత్మక సత్సంబంధాలు ఉన్నాయని, అంతేకాకుండా ఆ దేశ సైనికులతో కూడా మెరుగైన సంబంధాలను చైనా కలిగి ఉందని, వీటితో పాటు చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్తో ఆ రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
ఉగ్రవాద సమస్యపై అమెరికా ఆందోళనను చైనా అర్థం చేసుకోగలదని, అందుకే పాకిస్తాన్తో ఉన్న సమస్యను పరిష్కరించడంలో ఆ దేశం కీలక పాత్ర పోషించగలదని, ఆప్ఘనిస్తాన్ - పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడేలా చేయడంలోను సహాయం చేయగలదని అన్నారు. అటు ఆప్గనిస్తాన్తోను చైనా సంబంధాలను కలిగి ఉందని, అందుకే ఇరు దేశాలతో మాట్లాడి ఉగ్రవాదులపై పోరాటానికి చైనా ఒప్పించగలుగుతుందని అభిప్రాయపడ్డారు.