వీడియో వైరల్ : వైరస్కు కారణం గబ్బిలమని తెలిసినా.. ఈ యువతి ఆ సూప్ను తింటోంది
Recommended Video
చైనాతో పాటు ఇతర దేశాలను కూడా కరోనరీ వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి చాలా మంది మృతి చెందారు. కరోనరీ వైరస్కు కారణం కొన్ని జంతువులే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనరీ వైరస్ గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ ఓ మహిళ మాత్రం అవేమీ తనకు పట్టనట్టుగా ఆ గబ్బిలాలనే తింటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గబ్బిలం సూప్ తాగుతున్న యువతి
ఓ రెస్టారెంట్కు ఆకలి మీద వెళ్లిన మహిళ గబ్బిలం సూప్ను ఆర్డర్ ఇచ్చింది. ఆ సూప్ను తీసుకొచ్చి ఆమె ముందు ఉంచాడు వెయిటర్. ఇంకేముంది లొట్టలేసుకుంటూ గబ్బిలం సూప్ను తాగేసింది. అంతేకాదు గబ్బిలంను కూడా తింటూ ఉండగా ఎవరో వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే ఈ వీడియో వైరల్ అయ్యింది. గత నెలలో చైనాలోని వూహాన్ నగరంలో ఈ డెడ్లీ కరోనరీ వైరస్ను ముందుగా కనుగొన్నారు. ఇప్పటికే ఈ జబ్బు సోకి 25 మంది మృతి చెందారు. 800 మందికి పైగా చికిత్స పొందుతున్నారు.
కరోనరీ వైరస్కు గబ్బిలం కూడా కారణమే
ముందుగా వైరస్ను గుర్తించిన వైద్యులు ప్రమాదకరమైనది కాదని చెప్పారు. కానీ అది కాస్త న్యుమోనియాకు దారితీస్తుండటంతో అప్రమత్తమయ్యారు. క్రమంగా ఈ వైరస్ సోకి మృతి చెందుతుండటంతో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. అయితే ఈ వైరస్ పాములు, మరియు గబ్బలాల నుంచి వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చైనాకు చెందిన ఓ యువతి గబ్బిలం తింటూ కెమెరా కంటికి చిక్కడం చర్చనీయాంశమైంది. గబ్బిలం యొక్క మాంసం తినాలి కానీ ఆ చర్మంను తినకూడదని ఓ వ్యక్తి చెప్పడం వీడియోలో వినిపిస్తుంది.
10 రెట్లు ప్రమాదకరం అని చెప్పిన వైరాలజిస్టు
2003లో తొలిసారిగా దీని మూలాలను కనుగొన్న ఓ చైనీస్ వైరాలజిస్టు కరోనరీ వైరస్ అనే ఈ అత్యంత ప్రమాదకరమైన వైరస్ 10 రెట్లు ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. 17 ఏళ్ల క్రితం అంతంత మాత్రంగానే ఉన్న ఈ వైరస్ ఇప్పుడు ప్రమాదపు స్థాయిని మించిందని చెప్పారు. ఒక్కసారి సోకిందంటే మనిషి ప్రాణాలకు గ్యారెంటీ లేదని ఆ వైరాలజిస్ట్ హెచ్చరిస్తున్నారు. చైనాలో పలు జబ్బులు అయిన మలేరియా, దగ్గు, గొనోరియా వంటి వ్యాధుల చికిత్స కోసం తయారు చేసే మెడిసిన్స్లో గబ్బిలాలను వినియోగిస్తారు.