కరోనా ఎఫెక్ట్ ... బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ పర్యటన వాయిదా
దేశంలో కోవిడ్ -19 పరిస్థితి దారుణంగా మారిన నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను వాయిదా వేశారు. భారతదేశం ప్రస్తుతం రెండవ దశలో ఘోరమైన కరోనావైరస్ విజృంభణ చూస్తోంది. యుకె పీఎం బోరిస్ జాన్సన్ ఏప్రిల్ చివరలో భారతదేశాన్ని సందర్శించాల్సి ఉంది, కాని ఇప్పుడు దేశంలో ప్రస్తుత కోవిడ్ -19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తన పర్యటనను వాయిదా వేశారు.

కరోనా కేసుల తీవ్రత నేపధ్యంలో బోరిస్ జాన్సన్ పర్యటన వాయిదా
భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇరు దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ లో డబుల్ మ్యూటాంట్ కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపధ్యంలో కోవిడ్ -19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించరని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, కరోనా నేపథ్యంలో ఇరుదేశాలు రాబోయే రోజుల్లో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నాయి.

యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ఢిల్లీ పర్యటనను వాయిదా వేసినట్టు వెల్లడించిన డౌనింగ్ స్ట్రీట్
భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి కారణంగా పరిస్థితి క్షీణించడంతో, బోరిస్ జాన్సన్ తన న్యూ ఢిల్లీ పర్యటనను వాయిదా వేసినట్టు డౌనింగ్ స్ట్రీట్ ప్రకటించింది. బోరిస్ జాన్సన్ ఏప్రిల్ 26 న భారతదేశానికి వచ్చి కొద్దిరోజులపాటు పర్యటించాల్సి ఉంది, ఇది యుకె-ఇండియా మధ్య మెరుగైన వాణిజ్య భాగస్వామ్యాన్ని ఖరారు చేస్తుందని ఇంతకుముందు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఏదేమైనా, భారతదేశంలో మహమ్మారి సంక్షోభం మరింత దిగజారిపోవడంతో, ప్రయాణాన్ని వాయిదా వేయవలసి వచ్చింది .

కరోనాపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్న భారత్ ప్రధాని మోడీ
భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 కేసుల పెరుగుదల దృష్ట్యా విదేశీ ప్రతినిధులు మరియు ప్రముఖులతో తన వ్యక్తిగత సంభాషణలను తగ్గించాలని పిఎం నరేంద్ర మోడీ నిర్ణయించారు. రాబోయే రోజుల్లో పీఎం నరేంద్ర మోడీ కోవిడ్ సంబంధిత సమావేశాలపై దృష్టి సారించనున్నారని, అందువల్ల ఆయన విదేశీ అతిథుల సమావేశాలపై దృష్టిసారించబోరని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి.

గతంలోనూ ఓ మారు బోరిస్ జాన్సన్ పర్యటన రద్దు
గతంలో ఒకమారు బోరిస్ జాన్సన్ భారత్ పర్యటనకు రావలసి ఉండగా యూకే లో అప్పుడు కొత్త రకం కరోనా వైరస్ విజృంభణ నేపద్యంలో అప్పుడు కూడా ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఇండియాలో తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోమారు బోరిస్ జాన్సన్ పర్యటనకు కరోనా అడ్డంకిగా మారింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications