'గూఢచారి' షాకింగ్: రాజపక్స ఓటమిలో 'రా' చీఫ్ కీరోల్, అందుకే?
కొలంబో/న్యూఢిల్లీ: శ్రీలంకలో మహింద రాజపక్స పాలనకు ముగింపు పలకడంలో భారత్ రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) అని శ్రీలంక మీడియా బలంగా నమ్ముతోందట. మైత్రిపాల సిరిసేనకు భారత్ మద్దతును ప్రకటించి, ఆయన గెలుపుకు వెనుక ఉండి మంత్రాంగం నడిపించిందని శ్రీలంక పత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి.
సిరిసేన గెలుపుకు కొలంబోలోని 'రా' చీఫ్ తోడ్పడ్డారని ప్రచారం సాగుతోంది. కొలంబోలో పని చేస్తున్న 'రా' స్టేషన్ చీఫ్ను ఎన్నికలకు ముందు దేశం విడిచి వెళ్లాలని నాటి ప్రభుత్వం ఆదేశించినట్లుగా వార్తలు వాస్తున్నాయి.

కొలంబోలోని 'రా' స్టేషన్ చీఫ్ను వెళ్లాలని ఆదేశించినట్లుగా అటు శ్రీలంక, ఇటు భారత్లో అనధికారికంగా చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్ష సిరిసేనకు అనుకూలంగా పని చేస్తున్నారనే కారణంతోనే రాజపక్స అయనను వెళ్లమని ఆదేశించారని అంటున్నారు.
అయితే, అది సాధారణ ట్రాన్సుఫర్లో భాగమేనని చెబుతున్నప్పటికీ, అనధికారికంగా ఇరు దేశాల అధికారులు.. మైత్రిపాల సిరిసేనకు అండగా నిలబడినందుకు ఆయనను డిసెంబర్ నెలలో రీకాల్ చేశారని అంటున్నారు. ఇందుకు సంబంధించి శ్రీలంకలోని పలు పత్రికలలో వార్తలు కూడా వచ్చాయి.












Click it and Unblock the Notifications