Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోదీని బెదిరించి యుద్దం ఆపా.. ట్రంప్ సంచలనం!

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తాను కీలక పాత్ర పోషించానని ఆయన పేర్కొన్నారు. సుంకాలు ఉపయోగించి తాను అనేక అంతర్జాతీయ సంఘర్షణలను నిలువరించానని.. అందులో భారత్-పాక్ వివాదం కూడా ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. వాణిజ్యం, సుంకాలు ప్రపంచ పోరాటాలను ఆపడంలో అమెరికాకు ఎలా సహాయపడతాయో అని స్పష్టం చేశారు. "మేము వాణిజ్యంలో అద్భుతంగా రాణిస్తున్నాం. వందల బిలియన్ డాలర్ల సుంకాలను పొందుతున్నాం. ఈ సుంకాలు అమెరికాను చాలా సంపన్నంగా, శక్తివంతంగా మారుస్తున్నాయి." అని ట్రంప్ అన్నారు.

ఏడు విమానాలు కూల్చివేశారు: ట్రంప్
ఈ సందర్భంగా ట్రంప్ భారత్-పాక్ వివాదాన్ని ప్రస్తావించారు. "మేము వాణిజ్యం ద్వారా అనేక యుద్ధాలను ఆపాం. ఉదాహరణకు, భారత్, పాకిస్తాన్ మధ్య చాలా తీవ్రమైన పోరాటం జరిగింది. ఇందులో ఏడు విమానాలు కూల్చివేయబడ్డాయి." అని ఆయన అన్నారు. భారత్-పాక్ దేశాల మధ్య పరిస్థితులు మారుతున్నప్పుడు ఉద్రిక్తతను తగ్గించడానికి తాను ఆ రెండు దేశాలతో మాట్లాడినట్లు చెప్పారు.

Donald Trump Claims He Stopped India-Pakistan War with Tariff Threat

"నేను అప్పుడు వారితో వాణిజ్యం గురించి మాట్లాడుతున్నాను. నేను వారిని అడిగాను, మనం వాణిజ్యం ఎలా చేస్తాం?" అని ట్రంప్ తెలిపారు. దానికి వారు 'సర్, మేము వ్యాపారంలో చాలా బాగా రాణిస్తున్నాం' అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత నేను 'సరే, యుద్ధం ఆగకపోతే, మేము బాగా రాణించలేము. మేము ఎటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోము' అని స్పష్టంగా చెప్పానని ట్రంప్ వివరించారు.

200 శాతం సుంకం బెదిరింపు
ఒకసారి చెప్పిన తర్వాత కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గకపోవడంతో, వాణిజ్యపరమైన ఒత్తిడిని ఉపయోగించి పరిస్థితిని ఎలా శాంతింపజేశారో ట్రంప్ వెల్లడించారు. "నేను మళ్లీ వారికి ఫోన్ చేసి, స్ట్రెయిట్‌గా చెప్పాను: 'వినండి, మీరు ఈ యుద్ధాన్ని ఆపకపోతే, మీరు అమెరికాకు విక్రయించే ఏ ఉత్పత్తిపైనైనా 200 శాతం సుంకం విధిస్తామని బెదిరించా'" అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సుంకం బెదిరింపుతో ఇరుపక్షాలు ఆందోళన చెందాయని.. "లేదు, లేదు, లేదు, మీరు అలా చేయలేరు" అని ఇరు దేశాలు అన్నాయని ట్రంప్ తెలిపారు. దానికి తాను "నేను ఎందుకు చేయలేను? నేను దీన్ని చాలా సులభంగా చేయగలను" అని బదులిచ్చానని ట్రంప్ అన్నారు.

అణు యుద్ధం ప్రమాదం చాలా ప్రమాదకరం
అణ్వాయుధాల విధ్వంసక సామర్థ్యం గురించి ట్రంప్ చెబుతూ.. దాని ప్రభావం అన్నింటిపైనా ఉంటుందని ట్రంప్ అన్నారు. "ఇది చాలా శక్తివంతమైన ఆయుధం, చాలా శక్తివంతమైనది. దీని గురించి మీరు మాట్లాడాలని కూడా కోరుకోరు" అని ఆయన పేర్కొన్నారు.వాణిజ్యం, సుంకాలను విధించే భయంతో రెండు దేశాలు చివరకు వెనక్కి తగ్గాయని ట్రంప్ తెలిపారు. తన జోక్యం ఒక భయంకరమైన సంఘర్షణను నివారించిందని, "ఇది బహుశా అణు యుద్ధం కావచ్చు" అని ట్రంప్ ప్రకటించారు.

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత
డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన ఈ ఏడాది ప్రారంభంలో భారత్-పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తత నేపథ్యంలో వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు పహల్గాంలో జరిపిన దాడిలో 25 మంది భారతీయ పౌరులు సహా మొత్తం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా, భారత సాయుధ దళాలు మే 7న 'ఆపరేషన్ సింధూర్'ను ప్రారంభించి, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. ఈ దాడులతో సరిహద్దు దాటిన ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+