ఇరాన్ జీవనాడిపై అమెరికా దెబ్బ- ఓటమిని అంగీకరించిందని ట్రంప్ ప్రకటన
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ పూర్తిగా ఓడిపోయిందని, తన ఓటమిని అంగీకరించిందని వెల్లడించారు. తమతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం ప్రతిపాదించిన ఆ ఒప్పందం తనకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇరాన్పై అమెరికా సైనిక విజయాలను మీడియా సరిగా నివేదించడం లేదంటూ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు.
దీనికి సంబంధించిన సమాచారాన్ని తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. అమెరికా సైన్యం ఇరాన్పై ఎంత బాగా చేసిందో రిపోర్ట్ చేయాలంటే 'ఫేక్ న్యూస్ మీడియా'కు చాలా కోపం అని ఎత్తిపొడిచారు. ఇరాన్ పూర్తిగా ఓడిపోయిందని, ఒక డీల్ కోరుతోందని అన్నారు. అది తాను అంగీకరించే డీల్ మాత్రం కాదని పేర్కొన్నారు. ఇరాన్ జీవనాడిగా భావించే అత్యంత ప్రధానమైన ఖార్గ్ దీవిపై అమెరికా వైమానిక దాడుల అనంతరం ట్రంప్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఖార్గ్ ఐలండ్ పై దాడులను ట్రంప్ నిర్ధారించారు కూడా. తన ఆదేశాల మేరకు కొద్దిసేపటి కిందటే యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ సైనికులు మధ్యప్రాచ్య చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన బాంబింగ్ దాడులను నిర్వహించిందని అన్నారు. ఇరాన్ కిరీటంలో డైమండ్ గా భావించే ఖార్గ్ దీవిలోని ఐఆర్జీసీ శిబిరాలను తుడిచిపెట్టారని చెప్పారు. తమ ఆయుధాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవి, అధునాతనమైనవనే విషయం ఈ దాడులతో తేటతెల్లమైందని వ్యాఖ్యానించారు.
ఖార్గ్ దీవిలోని ఆయిల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను ధ్వంసం చేయకూడదని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ వివరించారు. హార్ముజ్ జలసంధి గుండా నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణానికి ఇరాన్ అడ్డుతగిలితే, చమురు మౌలిక వసతులపై తన నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తానని కూడా ఆయన హెచ్చరించారు. తన మొదటి పదవీకాలంతో పాటు ఇప్పుడు కూడా సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన, సమర్థవంతమైనదిగా పునర్నిర్మించానని ట్రంప్ పేర్కొన్నారు. తమను అడ్డుకునే శక్తి ఇరాన్కు లేదని అన్నారు.
“Moments ago, at my direction, the United States Central Command executed one of the most powerful bombing raids in the History of the Middle East, and totally obliterated every MILITARY target in Iran’s crown jewel, Kharg Island... Iran has NO ability to defend anything that we… pic.twitter.com/2iEzCOyA3P
— The White House (@WhiteHouse) March 13, 2026
కాగా- ఈ యుద్ధం 15వ రోజుకు చేరుకోగా దీనికి ముగింపు కనపించట్లేదు. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ ప్రయాణాలు, భద్రతకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది ఇరాన్లోనే కాగా, లెబనాన్, గల్ఫ్ దేశాల్లో కూడా మరణాలు నమోదయ్యాయి. దశాబ్దాల తర్వాత తొలిసారిగా గల్ఫ్ ప్రాంతం యుద్ధ ముఖద్వారంలో నిలిచింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
-
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
తాడో పేడో: యుద్ధం ఆపే ప్రసక్తే లేదు- ట్రంప్ కు నెతన్యాహు అర్జంట్ ఫోన్ కాల్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ఖమేనీ సంధి ఒప్పందం? -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ?












Click it and Unblock the Notifications