ఇండోనేషియాలో అర్థరాత్రి భారీ భూకంపం: ఇళ్ల నుంచి బయటికి జనం పరుగులు
జకార్తా: ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. భారీ భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఆ దేశ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇండోనేషియాలోని తూర్పు ప్రావిన్స్ పపువా బరాత్లో గురువారం (నవంబర్ 11న) తెల్లవారుజామున 12.46 గంటలకు సంభవించిన భారీ భూకంపంతో బెంబేలెత్తిపోయారు.
ఇళ్లల్లో నిద్రపోతున్న ప్రజలంతా.. భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.1 గా నమోదైనట్లు వాతావరణ సంస్థ జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది. ఇండోనేషియా కైమానా జిల్లా కేంద్రానికి 115 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలపింది.

ఇది సముద్ర గర్భం కింద 14 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని, ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్ధని వాతావరణ శాస్త్ర, జియోఫిజిక్స్ ఏజెన్సీ స్పష్టం చేసింది.
భూకంపం వల్ల ఆస్థి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లుగా సమాచారం లేదు. కాగా ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈక్రమంలో గురువారం తెల్లవారుజామున 12.46 గంటలకు మరోసారి భూ ప్రకంపనలతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications