మతం పేరుతో ఘాతుకాలు, ఇస్లాం సమర్దించదు: క్రికెటర్
న్యూఢిల్లీ: 27 ఏళ్ల ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ మెుయిన్ అలీ బ్రిటన్ ముస్లింలకు ఓ విజ్ఞప్తి చేశాడు. ఇద్దరు అమెరికా జర్నలిస్టులను, ఓ బ్రిటిష్ పౌరుడిని అత్యంత కిరాతకంగా చంపేసిన ఐఎస్ఐఎస్ లాంటి ఉగ్రవాద గ్రూపులకు దూరంగా ఉండాలని బ్రిటన్ ముస్లింలను కోరాడు.
మతం పేరుతో ఇలాంటి ఘాతుకాలను చేస్తున్నఇస్లాం సమర్దించదని అలీ స్పష్టం చేశాడు. 'హఫింగ్ టన్' పోస్ట్కి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ ఐఎస్ఐఎస్ ఘాతుకాలను ఇస్లాం ఖండిస్తుందని, ముస్లింలుగా మనం సహనంగా పాటించాలని అన్నారు. మెుయిన్ అలీ పాకిస్ధాన్ సంతతకి చెందిన క్రికెటర్.

ఇటీవలే భారత్తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ సందర్బంగా 'సేవ్ గాజా' రిస్ట్ బ్యాండ్ ధరించి వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. బర్మింగ్ హామ్లో జరిగిన వన్డే మ్యాచ్లో అభిమానులను అలరించిన మెుయిన్ అలీ... సిరియాలో ఐఎస్ఐఎస్ గ్రూప్లో చేరని బాషర్ అల్ అసద్ సంతతకి చెందిన ముస్లింలను ఏ విధంగా చిత్రవధలు చేసి చంపేస్తున్నారో తెలిపాడు.












Click it and Unblock the Notifications