శుభవార్తే: ఫేస్ బుక్ పోస్టుల రూల్స్ మార్పు, నిఘాకు చెక్ పెట్టేసిన ఫేస్ బుక్
ఫేస్ బుక్ తన నిబంధనలను కఠినతరం చేసింది.పేస్ బుక్ లో పోస్టుల ఆధారంగా పోస్ట్ చేసిన వారిపై నిఘా ఏర్పాటు చేయకుండా నిబంధనలను మార్చేసింది.
వాషింగ్టన్: ఫేస్ బుక్ తన నిబంధనలను కఠినతరం చేసింది. ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ లలో ఉన్న సమాచారాన్ని సేకరించి, దాని ఆధారంగా నిఘా పెట్టడానికి సంస్థలకు వీలు లేకుండా నిషేధించింది.
సోషల్ మీడియా మానిటరింగ్ కంపెనీలు తాము సేకరించిన సమాచారాన్ని చట్ట సంస్థలకు అమ్ముకొంటున్నాయని వాటి ద్వారా వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారని ఇటీవల గుర్తించారు.
ప్రధానంగా కొన్ని దేశాల్లో వర్ణవివక్షతో కూడ ఇలా కొంత మందిని టార్గెట్ చేస్తున్నట్టు తెలిపింది. తమ అభిప్రాయాలను స్వేచ్చగా చెప్పేందుకుగాను ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించుకొనేవాళ్ళకు ఈ సోషల్ మీడియా నిఘా అనేది పెనుముప్పుగా పరిణమించింది.

కొన్ని చట్ట సంస్థలు కూడ ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని వ్యక్తుల మీద కేసులు పెడుతున్నాయని ఏసిఎల్ యూ తరపు న్యాయవాది మాల్ కాగిల్ తెలిపారు. అయితే ఇప్పుడు ఇలా ఫేస్ బుక్ ద్వారా సమాచారాన్ని నిఘా అవసరాల కోసం వాడుకోవడాన్ని పూర్తి నిషేధించినట్టు ఆ సంస్థ వివరించింది.
అయితే నిఘా అంటే ఏంటన్న విషయాన్ని మాత్రం పూర్తిగా వివరించలేదు.ఫేస్ బుక్ పోస్టింగులను మానిటర్ చేసేందుకు కొన్ని రకాల టూల్స్ ఉంటాయి. వీటిని ఉపయోగించి ఎవరెవరు ఎలాంటి పోస్టింగ్ లు చేస్తున్నారో పరిశీలించవచ్చు.
అమెరికాలాంటి దేశాల్లో నిఘా సంస్థలు ఈ టూల్స్ విస్తృతంగా వాడుతున్నాయి. ఇందుకోసం 2010 నుండి ఇప్పటివరకు రూ.40 కోట్లు వెచ్చించాయి. అయితే తాము పోస్టు చేస్తున్న సమాచారమే తమకు ఇబ్బంది కల్గిస్తోందన్న విషయం చాలా మందికి తెలియదు.
దాంతో ఇప్పుడు సామాన్య ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకుగాను ఫేస్ బుక్ తన పాలసీని పూర్తిగా మార్చింది.అందులోని సమాచారాన్ని నిఘా అవసరాల కోసం ఉపయోగించకుండా నిబంధనలను విధించింది. తన ప్లాట్ ఫాం ను నిఘా కోసం ఉపయోగించే టూల్స్ ను తయారు చేసే డెవలపర్ పై తాము ఇప్పటికే చర్యలు తీసుకొంటున్నట్టు పేస్ బుక్ తెలిపింది.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications