ఉద్యోగుల కోసం ఫేస్బుక్ సరికొత్త యాప్: ఇక వర్క్ప్లేస్ లోను ఉపయోగించుకోవచ్చు..
వర్క్ప్లేస్లో ఉద్యోగుల మధ్య సమన్వయం కోసం ఈ చాటింగ్ యాప్ ను ఆవిష్కరించింది.
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సరికొత్త యాప్ రూపొందించింది. వర్క్ప్లేస్లో ఉద్యోగుల మధ్య సమన్వయం కోసం ఈ చాటింగ్ యాప్ ను ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్, పీఎస్ లలో ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఫేస్ బుక్ వర్క్ ప్లేస్ కు ఈ యాప్ అనుంధంగా ఉంటుంది. ఉద్యోగుల మధ్య మెసేజ్ లకు ఇది ఉపయోగపడుతుంది. ప్రాజెక్టులు, ఇతరత్ర చర్చల వంటివి ఈ యాప్ ద్వారా కొనసాగించవచ్చు. లైవ్ వీడియో సెషన్స్ ఏర్పాటు చేసుకునే సదుపాయం కూడా ఉంది.
వర్క్ప్లేస్లో ఉన్నప్పుడు ఉద్యోగులు ఎక్కువగా మొబైల్ డివైజ్ల కంటే తమ డెస్క్టాప్లనే వాడుతుంటారు. ఎక్కువ సమయం డెస్క్టాప్లకే కేటాయిస్తుంటారు. అందువల్లే ఫేస్ బుక్ ఈ డెస్క్ టాప్ యాప్ తీసుకొచ్చింది. వర్క్ ప్లేస్ చాట్ ద్వారా సహ ఉద్యోగులతో లేదా గ్రూపుతో వీడియో చాట్, స్క్రీన్ షేరింగ్, ఫైల్ షేరింగ్, మెసేజ్, రియాక్షన్స్, జీఐఎఫ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.