పరువు హత్య: సామియా తండ్రి, మాజీ భర్త అరెస్టు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సంతతికి చెందిన బ్రటీష్ మహిళ సామియా షాహిద్ (28) పరుపు హత్య కేసులో ఆమె తండ్రి మహమ్మద్ షాహిద్, సామియా షాహిద్ మాజీ భర్త మహ్మమద్ షకీల్ ను పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేశారు.
వీరిద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నామని పాక్ పోలీసు అధికారులు తెలిపారు. సామియాను వీరిద్దరు హత్య చేసినట్లు పక్కా బలమైన సాక్షాలు సేకరించామని పోలీసులు చెప్పారు.
నిందితులను కోర్టులో హాజరుపరిచే లోపు పూర్తి ఆధారాలు సేకరిస్తామని అంటున్నారు. పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని జెలుం జిల్లాలో సామియా తల్లిదండ్రుల ఇంట్లో గత నెల 20వ తేదిన సామియా హత్యకు గురైయ్యింది.
సామియా అనారోగ్యానికి గురైయ్యిందని, ఆమె మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారు. సామియా రెండో భర్త ముక్తార్ కాజిమ్ ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగు చూసింది.
షియా తెగకు చెందిన ముక్తార్ కాజిమ్ ను సామియా రెండో పెళ్లి చేసుకుందని ఆమె తండ్రి, మాజీ భర్త కక్ష పెంచుకున్నారు. సమయం చూసి ఆమెను హత్య చెయ్యాలని ప్లాన్ వేశారు.
తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన సామియాను గొంతు నులిమి హత్య చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వేరే కులం వ్యక్తిని రెండవ పెళ్లి చేసుకుందని కోపంతో ఆమెను చంపేశారని పోలీసులు తెలిపారు.