బంగ్లాదేశ్ లో మరో హిందువు దారుణ హత్య.. ఇప్పటికి ఐదుగురు..
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. హిందూ మైనారిటీ ప్రజలపై దాడులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో హిందువును దారుణంగా హతమార్చారు. రాణా ప్రతాప్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఇప్పటికే ఐదుగురు హిందువులను కిరాతకంగా హతమార్చి , మృతదేహాలను కాల్చిన విషయం తెలిసిందే. అలాగే ఓ హిందూ వితంతు మహిళపై అత్యాచారం చేసి ఆమె జుట్టు కత్తిరించి ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన విషయం తెలిసిందే.
భారత సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ లో ఎన్నికల సమయంలో హిందువుల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో హిందూ మైనారిటీ యువకుడ్ని కాల్చి చంపారు దుండగులు. బంగ్లాదేశ్ లో దీపూ చంద్ర దాస్, అమృత్ మండల్, బజేంద్ర బిస్వాస్ ల హత్యలు మరువక ముందే మరో ఘటన జరగడంతో బంగ్లాదేశ్ లో హిందువులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.

తాజాగా జెస్సోర్ జిల్లాలోని కోపాలియా బజార్ వద్ద రాణా ప్రతాప్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. మీడియా కథనాల ప్రకారం ప్రతాప్ ది అరువా గ్రామం అని తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో స్పాట్ లోనే అతడు మృతి చెందాడు. ఘటన తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications