లక్ష్యాన్ని సాధించారు:800 మంది ఉద్యోగులకు నౌకలో పార్టీ ఇవ్వనున్న కంపెనీ
తమ కంపెనీ లాభాలను సాధించినందుకుగాను 800 మంది ఉద్యోగులకు కంపెనీ ఖర్చుతో విందుకు ఏర్పాటుచేయనున్నారు. అమెరికాలోని బెర్చ్ క్యాబినేట్స్ కంపెనీ ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకొంది.
న్యూయార్క్ :తమ కంపెనీ అనుకొన్న లక్ష్యాలను చేరుకొన్న నేపథ్యంలో ఉద్యోగులకు ఆ కంపెనీ యాజమాన్యం భారీగా పార్టీని ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది. ఉద్యోగులకు క్రూయిస్ (లగ్జరీ)లో ఎంజాయి చేయాలని ఆ కంపెనీ కోరింది. ఐదు రోజుల పాటు అయ్యే ఖర్చులను తామే భరిస్తామని కంపెనీ ప్రకటించింది.
ఒక కంపెనీ లాభాల బాటలో పయనిస్తే ఆ బాటలో పయనించేందుకు కృషి చేసిన ఉద్యోగులకు ఆ కంపెనీ యాజమాన్యం కొత్త సంవత్సరం లో బంపర్ గిఫ్ట్ ను ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది.
బెర్చ్ క్యాబినేట్స్ కంెనీ సిఇఓ గ్యారీ బెర్చ్ ఉద్యోగులందరూ 2017 ప్రారంభంలో ఐదు రోజులపాటు కరేబియన్ క్రూయిస్ లో ఐదు రోజుల పాటు ఉండేందుకు ఖర్చును భరిస్తామని కంపెనీ ప్రకటించింది.
ఈ ఏడాది కాలంలో అనుకొన్న లక్ష్యాలను కంపెనీ చేరుకొందని సిఇఓ ప్రకటించారు. తమ లక్ష్యాలను సాధించినందుకుగాను కంపెనీ ఉద్యోగులందరికీ పార్టీ ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
ఐదురోజులపాటు మెక్సికో తీరంలో గల కొజుమెల్ ఐల్యాండ్ లో కరేబియన్ క్రూయిజ్ ఆగనుంది.జనవరి 9వ, తేది నుండి పదమూడు తేదిల మద్య కరీబియన్ దీవుల్లో విహరించనున్నట్టు గ్యారీ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకొన్నారు. కరేబియన్ క్రూయిజ్ కు వెళ్ళే ముందు ఉద్యోగులందరితో ఓ రాత్రి ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేయనున్నారు. గ్యారీ అక్కడి నుండి విమానంలో వారందరిని మియామికి తీసుకువెళ్ళనున్నారు. ఆ తర్వాత బస్సులో ఓడ వద్దకు చేరుకొంటారు.