అయిదేళ్లు... పదేళ్లు: రికార్డ్ సృష్టించిన పాకిస్తాన్ ప్రభుత్వం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ముస్లీం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ గురువారంతో అధికారంలోకి వచ్చి అయిదేళ్లవుతుంది. తద్వారా పూర్తి కాలాన్ని పూర్తి చేసుకుంది. 2013లో జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్-ఎన్ గెలుపొందింది. అంతకుముందు అధికారంలో ఉన్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నుంచి అధికారం చేజిక్కించుకుంది.
2013లో అధికారంలో చేపట్టిన పీఎంఎల్-ఎన్ పార్టీ గురువారంతో అయిదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకుంది. ఇలా ఓ ప్రభుత్వం అయిదేళ్ల పాటు అధికారంలో ఉండటం పాకిస్తాన్లో ఇది రెండోసారి! ఏడు దశాబ్దాల తర్వాత వరుసగా రెండు ప్రభుత్వాలు వరుసగా పూర్తి కాలం పాలన కొనసాగించడం ఇది మొదటిసారి.
14వ జాతీయ అసెంబ్లీ నిన్నటితో (31 మే 2018) రద్దయినట్లు పార్లమెంటు వ్యవహారాల శాఖ గురువారం ప్రకటన చేసింది. ప్రభుత్వం రద్దు కావడంతో జూలై 25వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకు మాజీ సీజే జస్టిస్ నాసిరుల్ ముల్క్ ప్రభుత్వానికి కేర్ టేకర్గా ఉంటారు.